సాక్షి, విశాఖపట్నం: పోలీస్ వ్యవస్థ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తోందని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మహిళలపై దాడులకు నిరసనగా విశాఖపట్నంలో మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ చెంచాలా పనిచేస్తోందని, మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో భూకబ్జాలు, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. భూముల కబ్జాపై తూతూ మంత్రంగా కమిటీ వేశారని, ఈ వ్యవహారంలో దర్యాప్తును గాలికి వదిలేశారని అన్నారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ పార్టీని భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. కబ్జా రాజకీయాలు, రోడ్డుపై మానభంగాలు ఇదా ప్రభుత్వ విధానమంటూ ప్రశ్నించారు. టీడీపీని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపించారు. అందాల పోటీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే మహిళలను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు విఫలయత్నం చేశారని గుర్తు చేశారు. ఎందుకు ఈ దుష్ట సంస్కృతిని ప్రవేశపడుతున్నారని, దీన్నిబట్టే చంద్రబాబు ఎలాంటివారో అర్థమవుతోందని అన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు.
Related news
-
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి. బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
పద్మవ్యూహంలో వీర అర్జునుడు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు. వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్ను తిట్టి పోస్తారు. దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి -
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్లో 900, ఆర్ట్స్లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం
Related News by category
-
మాయలు, మోసాలే బాబు నైజం
సాక్షి, అమరావతి: మాట ఇస్తే నిలబెట్టుకోవడం సీఎం జగన్ నైజం. ఇచ్చిన మాటను తుంగలో తొక్కడం చంద్రబాబు లక్షణం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో, నిజాయితీతో, రూపాయి అవినీతి లేకుండా వంద శాతం ప్రజలకు మేలు చేకూరేలా అమలు చేయడం సీఎం జగన్ లక్షణం. ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చేసి, మభ్యపెట్టి కుర్చీ ఎక్కిన తర్వాత ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం, వారికిచ్చిన హామీలకు తూట్లు పొడిచేయడం, అడుగడుగునా మోసం చేస్తూ ప్రజలను నిలువునా ముంచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య.ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వసనీయతకు, విలువలకు మారు పేరు సీఎం వైఎస్ జగన్ అయితే చంద్రబాబు వంచనకు, అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు. 2014లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో.. దాన్ని అమలు చేసిన తీరు, 2019లో వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో.. దాన్ని అమలు చేసిన విధానాన్ని పరిశీలించి చూస్తే ఈ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ తేడాయే జగన్ను ప్రజల్లో విశ్వసనీయమైన నేతగా నిలబెడితే,బాబును మోసకారిగా, నయవంచకుడిగా మిగిల్చింది. ప్రజలను మాయ చేసి నమ్మించడం కోసం చంద్రబాబు హామీలు ఇస్తారనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యం.పొరపాటున అధికారంలోకి వస్తే ఆ హామీలకు తూట్లు పొడిచేసి, ఆ తర్వాత హామీలన్నింటినీ అమలు చేశానని ఘనంగా బుకాయించడం చంద్రబాబుకి తెలిసినంతగా ఏ రాజకీయ నాయకుడికీ తెలియదు. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రజలను నమ్మించేందుకు ఆయన ఏకంగా 600కి పైగా హామీలు ఇచ్చారు. జనసేనతో కలిసి 52 పేజీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. వాటిని నమ్మి ప్రజలు అధికారమిస్తే వారి నడ్డి విరిచేసి, నిలువునా ముంచేసి, ఆ హామీలకు మంగళం పాడేశారు.రైతు రుణమాఫీ అమలు చేయకుండా మోసంచంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతు కుటుంబాలను నమ్మించారు. అప్పటికి ఉన్న రూ.87,616 కోట్ల రుణాలను చంద్రబాబు మాఫీ చేయాల్సి ఉంది. అయితే, 2014లో ఆయన అధికారంలోకి రాగానే దాన్ని నీరుగార్చే పని మొదలుపెట్టారు. కోటయ్య కమిటీని నియమించి రూ.24,500 కోట్లు మాఫీ చేస్తే సరిపోతుందని తేల్చారు. ఆ సొమ్మును కూడా ఐదేళ్లు ఇదు విడతలుగా ఇస్తానని మరో మడత పేచీ పెట్టారు. పోనీ అదైనా చేశారా అంటే అదీ లేదు. మూడు విడతలు మాత్రమే.. అది కూడా కొందరికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ అరకొర మాఫీ డబ్బు వడ్డీలకే సరిపోక రైతులు రుణ ఊబిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఇస్తానని నమ్మించి మోసం చేయడంతో ఆ వడ్డీలూ కట్టలేక రైతులు నిండా మునిగిపోయారు.అడుగుతున్నారని మేనిఫెస్టోనే మాయం చేశారు2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో, వాటి గురించి ప్రజలు అడుగుతుండటంతో సమాధానం చెప్పలేక దాన్ని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించిన చరిత్ర చంద్రబాబుది. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించి, 2019 ఎన్నికల్లో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించారు. కానీ ప్రజలు చంద్రబాబు నైజాన్ని గమనించి చరిత్రలో ఎన్నడూ లేనంత చిత్తుగా ఆయన్ని ఓడించి ఇంటికి సాగనంపారు.గత చరిత్రను మరిచి సూపర్ సిక్స్ పేరుతో మళ్లీ కొత్త హామీలుఇంతటి ఘనమైన తన హామీల చరిత్రను మరచిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ప్రజలను నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న హామీలను కాపీ కొట్టి ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ అంటూ పేర్లు మార్చి ప్రజల్లోకి వదిలారు. ముందస్తు మేనిఫెస్టో పేరుతో 11 నెలల క్రితమే దాన్ని విడుదల చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు తుది మేనిఫెస్టో వదిలారు.కానీ 2014 ఎన్నికల్లోనూ ఇదే కూటమి పేరుతో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోలు కలిపి, తాను సంతకం చేసి మరీ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్లు చెప్పుకొన్నారు. ఈ హామీలపై ప్రజలు నిలదీయడంతో మేనిఫెస్టోనే చెత్తబుట్టలో పడేశారు. దీంతో ప్రజలు కూడా 2019లో ఆయన్ని చెత్తలోకి నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో ప్రజలను వంచించేందుకు రెడీ అయ్యారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రజలు తిరస్కరించినా మళ్లీ సిగ్గు లేకుండా మేనిఫెస్టో పేరుతో వారి వద్దకు వెళ్లడానికి బరితెగించిన పచ్చి మోసకారి చంద్రబాబు.డ్వాక్రా రుణ మాఫీకి శఠగోపం2014 ఎన్నికల్లోనే డ్వాక్రా రుణాలనుమ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. సీఎం అవగానే ఎగనామం పెట్టారు. చంద్రబాబు వచ్చి తమ రుణాలు చెల్లిస్తాడని నమ్మిన అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రుణ వాయిదాలు, వడ్డీలు తడిసి మోపెడై అప్పుల పాలయ్యారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వీధివీధినా బెల్టు షాపులు పెట్టేలా ప్రోత్సహించారు. మహాలక్ష్మి పథకం కింద పుట్టిన ప్రతి ఆడబిడ్డకి రూ.30 వేలు డిపాజిట్ చేసి, యుక్త వయసు వచ్చాక రూ.2 లక్షలు వచ్చేలా చేస్తానని ఇచ్చిన హామీనీ గాలిలో కలిపేశారు.ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతీ లేదుబాబు వస్తేనే జాబు అని 2014 ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు.. సీఎం అయ్యాక పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం హామీని తుంగలో తొక్కేయడమే కాకుండా, ఉన్న ఉద్యోగాలనూ ఊడగొట్టారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినా, ఒక్కరికీ ఇవ్వలేదు. దీనిపై యువత నిలదీస్తుండటంతో ఎన్నికలకు 3 నెలల ముందు కొందరికి వెయ్యి చొప్పున విదిల్చి, మమ అనిపించారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, పేదలకు 3 సెంట్లలో ఇళ్ల స్థలం, పండంటి బిడ్డకు రూ.10 వేలు ఇస్తాననే హామీలనూ బుట్టదాఖలు చేశారు. బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలు, రూ.10 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి మోసం చేశారు. ఇలా హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. -
డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి.. రేవంత్ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఫైర్
కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం... పంజా.. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయం, నేరగాళ్లను పెంచి పోషించడం, కుటుంబపాలన, అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దోచుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తోంది. ఇది అమలుచేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆర్ (డబుల్ ఆర్) ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వాళ్లు తీసిన ‘ట్రిపుల్ ఆర్’ భారత్లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధిస్తే... తెలంగాణలో ఈ ‘డబుల్ ఆర్’ యావద్దేశం సిగ్గుపడేలా చేస్తోందని మండిపడ్డారు. ఈ ట్యాక్స్పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నల్లధనం రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ‘మీ అందరికీ ఆ డబుల్ ఆర్ ఎవరో తెలుసు. దానిని వివరించాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లకు కళ్లెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు. ఐదేళ్లలో రాష్రా్టన్ని నాశనం చేస్తారు’ అని ధ్వజమెత్తారు. దీనికి కళ్లెం పడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. మంగళవారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చిల్వర్ గ్రామం (అల్లాదుర్గ్)లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ... ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్ మహరాజ్లకు నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే.. ‘బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం కాగా... విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తొక్కి పెట్టింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఓటుకు కోట్లు కేసులో విచారణను ముందుకు సాగకుండా చర్యలు తీసుకుంది. ఈ రెండు పారీ్టలు ఒకరినొకరిని కాపాడుకోవాలని చూస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే.. అవి కరప్షన్ రాకెట్ కమిటీకి చెందిన సభ్యులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఇది అర్థమవుతోంది. బీఆర్ఎస్.. ఆప్తో కలిసి లిక్కర్ స్కామ్ చేసింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన పారీ్టతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది’ అని మోదీ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్.. రైతులకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడటం లేదు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. క్వింటాల్ వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వకుండా, కనీసం దానిపై మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారు’ అని మోదీ తెలిపారు. కాంగ్రెస్ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి.. ‘నేను జీవించి ఉన్నంత కాలం రాజ్యాంగానికి ఏమీ జరగకుండా కాపాడుకుంటాను. రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి ఎవరూ ఉండరు. కాంగ్రెస్కు, వాళ్ల తొత్తులు, చెంచాలకు సవాల్ చేస్తున్నా. దీన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దళితులు, బంజారా, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను మతప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చే ప్రయత్నాన్ని ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వను. కాంగ్రెస్ పార్టీ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే.. రాహుల్ గాంధీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నారు. మోదీకి రాజ్యాంగమంటే పవిత్రగ్రంథం, రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ సీఎంగా ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించాను. నేను కింద నడిచాను. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రతీక అయిన పార్లమెంట్ భవనం ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాను. రాజవంశీయులు (నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం) అధికార దాహంతో రాజ్యాంగాన్ని అవమానించారు. వాళ్లు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ను కూడా నమ్మడం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు. ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు... ‘ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి కాంగ్రెస్ నాయకులు రిజర్వేషన్లపై ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో వివిధ సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక డబుల్ ఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ఇండియా కూటమి నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కూటమికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు ఓటేస్తే అది పూర్తిగా నిష్ఫలమే. బీజేపీ ఒక్కటే వికల్పం, సంకల్పం. మీరు రఘునందన్ రావు, బీబీ పాటిల్కు ఓటు వేస్తే నేరుగా మోదీకి వేసినట్లే. తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చుచేసింది. 4 వందేభారత్ రైళ్లు, 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, మెదక్–ఎల్లారెడ్డి–బోధన్ జాతీయ రహదారిపై నిర్ణయం, సంగారెడ్డి–అకోల–నాందేడ్ నేషనల్ హైవే పూర్తి, అందోల్–నారాయణఖేడ్–జుక్కల్ రోడ్డులో కనెక్టివిటీ పెంపు...ఇలా ఎన్నో చర్యలు చేపట్టాం’ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్ను ఒక్క సీట్లో గెలుపైనా అవసరమా? ‘కేంద్రం ఎన్నో ప్రయాసలకు ఓర్చి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంటే... ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సంకుచిత రాజకీయాలు చేస్తోంది. సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకుంటే నేటికీ దానికి అవసరమైన భూమి ఇవ్వలేదు. మనోహరాబాద్–సిద్దిపేట–కోటపల్లి రైల్వేలైన్కు భూమి కేటాయించలేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ను ఒక్క ఎంపీ సీట్లో అయినా ప్రజలు గెలిపించాల్సిన అవసరముందా? కనీసం హైదరాబాద్లో పండుగ నిర్వహించుకోవాలంటే కూడా చివరకు శ్రీరామ నవమికి కూడా ఆంక్షలు పెట్టింది. ఒక వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్కు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు.. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. గెలిచాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఏపీని ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. మీ కోసం నేను పోరాడతాను’ అని చెప్పారు. నెహ్రూ కాలం నుంచి మోసం ‘కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ను గౌరవించలేదు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేసి పెద్ద తప్పు చేశారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఎమర్జెన్సీ విధించారు. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా, పత్రిక స్వేచ్ఛను హరించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ చట్టరూపకంగా బిల్లును తెస్తే.. దాన్ని రాహుల్ చింపివేశారు. రాజ్యాంగానికి వారిచ్చే గౌరవమిది. రాజ్యాంగాన్నే కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కూడా అవమానించి అప్పటి అధ్యక్షుడు సీతారాం కేసరిని బాత్రూంలో బంధించి సోనియాగాం«దీని అధ్యక్షురాలిని చేశారు. వీరికి అధికారమే సర్వస్వం’ అని మోదీ మండిపడ్డారు. -
బూటకపు హామీలకు కేరాఫ్ బాబు
సాక్షి, అమరావతి: బూటకపు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికొదిలేయడంలో కేరాఫ్ అడ్రస్ ఎవరిదంటే అందరూ చెప్పేమాట చంద్రబాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అలవికాని హామీలను ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఈసారి కూడా ఇదే రీతిలో చంద్రబాబు, తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు ఆలోచనల నుంచిలో అమలవుతున్న పథకాలను యథాతథంగా కాపీ కొట్టి మక్కీకి మక్కీ దించేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాపీ క్యాట్ బాబు.. రాష్ట్రంలో ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ ఒక్కటే కావడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందేది.అలాంటిది అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతో రాష్ట్రంలో 90 శాతానికిపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వీరందరికీ రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇదే హామీ ఇవ్వడం వల్ల కొత్తగా ప్రజలకు వచ్చే ప్రయోజనమేముందని చర్చ జరుగుతోంది. డిజిటల్ హెల్త్ కార్డులూ కాపీయేనా బాబు? ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునే కాకుండా మరో దాన్ని కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 4.7 కోట్ల మందికిపైగా డిజిటల్ హెల్త్ కార్డులు అందజేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే డిజిటల్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు దగా మరువని ప్రజలు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణం అంటూ దాన్ని కూడా గాలికొదిలేశారు. ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్ల సౌకర్యం కలి్పస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎనీ్టఆర్ వైద్యసేవగా దానిపేరు మార్చి కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. ఇలా అనేక బూటకపు హామీలతో 2014లో అధికారంలో వచ్చి చంద్రబాబు చేసిన దగాను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. మందులూ మక్కీకి మక్కీ కాపీ.. తాము అధికారంలోకి వస్తే బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామంటూ చంద్రబాబు మరో హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర జబ్బులున్న వారిని గుర్తించారు.బాధితులందరికీ సొంత గ్రామాలు, వార్డుల్లోనే ప్రభుత్వ వైద్యులు క్రమం తప్పకుండా ఫాలోఅప్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మంచానికి పరిమితం అయిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందజేస్తున్నారు. ఉచితంగా మందులూ అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులే ప్రజల ఇంటి ముంగిటకే వెళ్లి సేవలు వైద్య సేవలు అందిస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే మందులు ఉచితంగా ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. -
కూటముల కురుక్షేత్రం
కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్స్వీప్ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్ఎల్డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్ నిషాన్ సింగ్ ఎన్నికల వేళ పార్టీకి గుడ్బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్ కురుక్షేత్రలో ఆప్ నేత సుశీల్ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్ సీట్గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడంతో హంగ్ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్ దుష్యంత్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్ సింగ్ కుమారులైన దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్ సారథ్యంలోని ఐఎన్ఎల్డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ (హెచ్జేసీ–బీఎల్) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్లాల్ 2007లో కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్లో విలీనం చేశారు.పోలింగ్ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది. -
ఫేక్ వీడియోల వెనుక రాహుల్ హస్తం
ఫేక్ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ఉన్న కొద్దిపాటి ఓటుబ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాగువాహటి: కాంగ్రెస్లో నిరాశ, అసంతృప్తి తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్ధాంతాలు, విలువలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడాలి తప్ప ఫేక్ వీడియోలను నమ్ముకోవడం ఏమిటని కాంగ్రెస్ను నిలదీశారు. మంగళవారం అస్సాం రాజధాని గౌహతిలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ గాం«దీకి, ప్రియాంక గాం«దీకి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోందని చెప్పారు. ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని అన్నారు. దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అన్ని మతాల పౌరులకు ఒకే పౌరచట్టం ఉండాలన్నారు. లౌకిక దేశంలో మతానికో చట్టం ఉండడం సరైంది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్దమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సివిల్ కాంట్రాక్టులు మైనార్టీలకు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆక్షేపించారు. తక్కువ బిడ్ దాఖలు చేసిన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తారు తప్ప ఇలా మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తామనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా మతపరమైన రిజర్వేషన్ ఉందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. ఓటర్లను మైనారీ్టగా, మెజార్టీగా చూసే అలవాటు తమకు లేదని కాంగ్రెస్కు చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి ఎంతమాత్రం లేదని పునరుద్ఘాటించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement