Sakshi News home page

చంద్రబాబు పచ్చి అవకాశవాది : లక్ష్మీపార్వతి

Published Wed, Jun 27 2018 1:43 PM

Lakshmi Parvathi Slams Chandrababu For His Cheap Politics - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తనకు బీజీపీ అంటే ఇష్టమే లేదని ప్రచారం చేసుకున్న చంద్రబాబు 2014 ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుటిలబుద్ధిని దుయ్యబట్టారు. అవసరం అనుకుంటే కాళ్లు పట్టుకునే చంద్రబాబు.. అవసరం తీరాక విసిరి గోదార్లో పడేస్తాడని చంద్రబాబు తీరును ఆమె విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. అలాంటిది గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సిద్ధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబును గోదావరిలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారని ఏపీ సీఎంను లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement