మగానుబాబుడు అనే నేత ఎంతో తెలివైనవాడు. తన తెలివితేటలతో మోకాలికీ బోడిగుండుకూ ముడేయగల సమర్థుడు. సదరు నేత గత ఎన్నికల్లో, ఈసారీ తెలివిగా ఎలక్షన్ సీజన్కూ, పండ్ల సీజన్కూ ముడిపెట్టాడు.
ఈ మగానుబాబుడు అనే నేత ఎన్నికల టైమ్లో పొత్తులు కుదుర్చుకోవడంలో దిట్ట. ఒంటరిగా ఎన్నడూ పోటీ చేయలేడు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాక్సిమమ్ ప్రయోజనం దొరుకుతుందో పసిగట్టి దాన్ని అందుకోవడంలో ఘనుడు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎన్నికల సీజనూ, పండ్లసీజనూ వచ్చేయడంతో అర్జెంటుగా తన రూటూ, మాటా మార్చే పనిలో పడ్డాడు.
అప్పటి ఎన్నికలూ ప్లస్ పండ్ల సీజన్లో కమలాలు చాలా మంచివని గర్జించాడు. ఇక్కడ కమలాలంటే కమలాపండ్లన్నమాట. వాటితో అధికారారోగ్య ప్రయోజనాలెన్నో ఉంటాయని గట్టిగా వాదించాడు. దాంతో అప్పట్లో చాలామంది అదే నిజమేమో అనుకున్నారు.
సరిగ్గా మళ్లీ ఎన్నికలు వచ్చే టైమ్కు ఎందుకో కాషాయ కలర్లో ఉండే కమలాపండ్లు తన అధికారారోగ్యానికి సరిపోవని ఆయనకు అనిపించింది. వాటితో పాటు తెల్లటి అరటిపండ్లూ, ఆకుపచ్చటి జామపండ్లూ కూడా తినేద్దామని నిశ్చయించుకున్నాడు.
ఇక మగానుబాబుడు ఎంత ఈజీగా వాదిస్తాడో అంతే సునాయాసంగా వాదన మార్చేస్తాడు. పొద్దస్తమానం కమలాలే తింటూ పోతే ఒకే రకం పోషకాలు దొరకచ్చు. కానీ ఒంటికి రకరకాల పండ్లు అవసరం. అందుకే ఈసారి నాకు అరటీ, జామా కావాల్సిందే అన్నాడు.
వెంటనే గత సీజన్ మాటలు గుర్తుంచుకున్న కొందరు ‘అదేంట్సార్.. అప్పుడలా అన్నారు కదా’ అని నిలదీశారు. దానికిలా చెప్పాడాయన. ‘‘నిజమే అప్పుడు నేను కమలాలు మంచివన్నాను. తీరా ఒలిచాక తొక్క చేతిలోకి వచ్చింది. అది అచ్చం కమలం పువ్వులా అనిపించింది. పండైతే బెటరేమోగానీ, ఒలిచేసిన ఆ తొక్క ఎంత కమలం పువ్వు షేపులో కనిపించినా దాంతో ఏం లాభమనిపించింది. పైగా నా చెవి కోసమే ఉద్దేశించిన పువ్వులా కనిపించిందది. వెంటనే ఆ తొక్కను దూరంగా విసిరేసి మన నేల మురికి కాకుండా చూస్తున్నా’’ అన్నాడు.
‘‘మరి కమలం పువ్వులా కనిపించిందని తొక్క పారేశారు సరే.. లోపలి తొనలు కూడా అదే రంగులో ఉన్నాయి కదా?’’ అని అడిగారు. ‘‘నో.. నో.. ఈ పండురంగు చాలా డిఫరెంట్. ఒలిచాక అరటి తెలుపు, ఒలవకపోయినా జామ ఆకుపచ్చ. కమలాతొనలు తింటున్నప్పటికీ వాటి రంగు వేరు. మా కొత్తపొత్తు పార్టీ జెండా తాలూకు రంగుల్లోని అరటి తెలుపు, జామాకుపచ్చకు పైన ఉండే రంగు వీటిది’’ అంటూ సమర్థించుకున్నాడు మగానుబాబుడు.
ఈ కమలాతొనల రంగు వేరే!
Published Wed, Nov 7 2018 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement