సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం దేశ వ్యాపంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీటర్లో స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు అభినందనలు. ఇది ప్రాంతీయ కూటమి విజయం’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. అసెంబ్లీలో సరైన బలం లేక విశ్వాసపరీక్ష ఎదుర్కొకుండానే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కుమారస్వామి ఆహ్వానించారు.
యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటన కుమారస్వామి తనతో మాట్లాడారని, తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కుమారస్వామి తనని ఆహ్వానించినట్లు మమత బెనర్జీ తెలిపారు.