సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండానే ఆర్భాటాలు చేస్తూ, జాతికి అంకితం ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం డయాఫ్రమ్ వాల్ కట్టి, జాతికి అంకితం ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హితవు పలికారు. ప్రజలపై భారం మోపకుండా పోలవరాన్ని పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్ట్ను పూర్తిచేసి, రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు.
ప్రజాస్పందనను చూసే..
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం పనులు ప్రారంభించి 39 శాతం పూర్తి చేశారు. కాలువలు సైతం ఆయన హయాంలోనే చాలా వరకు పూర్తయ్యాయి.పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లభించిన ప్రజాస్పందనను చూసి జనం దృష్టిని మళ్లించేందుకే పోలవరం పునాదిని జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు హంగామా చేశారు. డయాఫ్రం వాల్ కట్టి తానేదో ఘనకార్యం చేసిన ట్లుగా ప్రజలను మాయ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టును ఆయన పూర్తి చేయలేరు. వైఎస్ ప్రారంభించిన పోలవరాన్ని వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి పూర్తి చేస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యం’’ అని మేకపాటి పునరుద్ఘాటించారు. తమ రాజీనామాలను ఆమోదిస్తామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టంగా హామీ ఇచ్చారని, అన్నమాట ప్రకారం ఆమోదిస్తారని ఆశిస్తున్నామని మేకపాటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నిర్మించకుండానే అంకితమిచ్చేస్తారా?
Published Sat, Jun 16 2018 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement