‘సీఎం వైఎస్‌ జగన్‌ తన మార్క్‌ చూపించారు’ | Sakshi
Sakshi News home page

‘సీఎం వైఎస్‌ జగన్‌ తన మార్క్‌ చూపించారు’

Published Fri, Jun 7 2019 12:28 PM

MP Margani Bharath Ram Speaks About YS Jagan Governance - Sakshi

సాక్షి, రాజమండ్రి : ప్రభుత్వ ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై తన మార్క్‌ చూపించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఉద్యోగుల కష్టాన్ని జగన్‌ గుర్తిస్తారని ఆశా వర్కర్ల జీతాల పెంపుతో రుజువైందని తెలిపారు. శుక్రవారం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల ఆకాంక్షలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజమండ్రిలోని చారిత్రక గౌతమీ గ్రంథాలయంకు జాతీయస్థాయి గుర్తింపు దక్కేలా కృషిచేస్తానన్నారు. పార్టీ చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ ఎంపికయ్యారు.

Advertisement
Advertisement