సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది రోజైన మంగళవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సీప్లేన్’లో ప్రయాణించడం పలు రకాలుగా వివాదాస్పదమైంది. స్పైస్జెట్ ఏర్పాటు చేసిన ‘కొడాయిక్ ఎన్181కేక్యూ’ సీప్లేన్ ఆరేబియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బయల్దేరి పాకిస్థాన్లోని కరాచి మీదుగా ముంబైకి వచ్చింది. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఈ విమానం ఎక్కడం ఏమిటని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ సింగిల్ ఇంజిన్ కలిగిన విమానం ఎక్కడం ఏమిటని విస్తుపోతున్నాయి.
ఒక్క ప్రధాన మంత్రియే కాదు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన ఏ వ్యక్తి కూడా సింగిల్ ఇంజిన్ కలిగిన విమానంలో ప్రయాణించరాదని భద్రతా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. డబుల్ ఇంజిన్ కలిగిన విమానంలో ఎక్కితే ఒక ఇంజిన్ చెడిపోయినా మరో ఇంజిన్ సాయంతో విమానాన్ని పైలట్ దించవచ్చన్నది ఇక్కడ ఉద్దేశం. సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తే ఆ ఇంజిన్లో సమస్య వస్తే ప్రాణ రక్షణకు భరోసా ఉండదు. ఆరేబియా గల్ఫ్ నుంచి వచ్చిన కొడాయిక్ సీప్లేన్ మార్గమధ్యంలో పాకిస్థాన్లో కరాచిలో ఆగిందో, లేదోగానీ అక్కడి నుంచి వచ్చిందంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మణిశంకర్ అయ్యర్ నివాసంలో మన్మోహన్ సింగ్, పాక్ దౌత్య అధికారులు కలుసుకున్నారంటేనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పాక్ కుట్ర పన్నిందంటూ ఆరోపణలు చేసిన ప్రధాని మోదీకి ఈ జాగ్రత్తల గురించి తెలియదా?
అస్తమానం ‘మేకిన్ ఇన్ ఇండియా’ అనే మాట్లాడే మోదీ ప్రయాణించిన ‘కొడాయిక్ సీప్లేన్’ అమెరికాలో రిజిస్టర్ అయింది. అక్కడి రిజిస్టర్ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దీన్ని ఉపయోగించరాదు. పైగా ఈ విమానాన్ని నడిపిందీ కెనడా పైలెట్. ‘ మోదీ గురించి ఆ కెనడా పైలట్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విన్నాయంటే నోరు మూసుకోవాల్సిందే’ అంటూ ‘టైమ్స్నౌ’ ఓ భారీ శీర్షికను పెట్టింది. ఇంతకు ఆ కెనడా పైలట్ మోదీ గురించి చేసిన కామెంట్ ఏమిటంటే...‘మోదీ ఓ మంచి ప్రయాణికుడు’ అని. ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో రిజిస్టర్ అయిన సింగిల్ ఇంజిన్ విమానం, పైగా పాకిస్థాన్ నగరం నుంచి వస్తే, అందులోనూ కెనడా పైలెట్ నడుపుతుంటే మోదీ ఎక్కడం, అంబాజీ ఆలయాన్ని సందర్శించుకొని రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేశం సాధించిన అభివృద్ధా ? వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నమా?!
మోదీ ఎక్కిన ప్లేన్ పాక్ నుంచి వచ్చింది
Published Wed, Dec 13 2017 4:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement