సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కావాలని తాను కలలు కనడం లేదని సీనియర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన అత్యంత కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ మోదీ కేబినెట్లో స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దిమంది మంత్రుల్లో ఒకరిగా పేరొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగినంత మెజారిటీ రానిపక్షంలద్దితర పార్టీల మద్దతు కోసం కమలదళం ప్రధానమంత్రి పదవి విషయంలో రాజీపడవచ్చునని, మిత్రపక్షాలకు అంగీకారయోగ్యంగా మోదీకి బదులు నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకురావచ్చునని కథనాలు, ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రధాని మోదీ పనితీరుపై స్పందిస్తూ.. విధానా నిర్ణయాలు ప్రధాని చేతిలో కేంద్రీకృతం అయ్యాయనే ప్రతిపక్షాల వాదన తప్పు అని, ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులందరూ స్వతంత్రంగా పనిచేస్తున్నారని, కేబినెట్ సమావేశాల్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారని, కొన్నిసందర్బాల్లో ప్రధాని మోదీతోసైతం విభేదించి తమ అభిప్రాయాలు చెప్తున్నారని ఆయన వివరించారు. తనకు జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవని, తానో మామూలు వ్యక్తిని, సాధారణ కార్యకర్తనని, కేంద్రమంత్రిగా రూ. 10 లక్షల కోట్ల పనులు చేయిస్తున్నా.. కాంట్రాక్టర్ల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. రాజకీయాలు అంటే తనకు సామాజిక-ఆర్థిక సంస్కరణ మాత్రమేనని, అంతేకానీ తన జీవితంలో ఏనాడూ ప్రధాని పదవి గురించి కలలు కనలేదని ఆయన చెప్పారు.
Published Mon, May 14 2018 1:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement