సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలవడం, ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తడంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. నిన్నటి వరకు తిట్టుకున్న పవన్ కల్యాణ్, కేసీఆర్లను చూస్తుంటే శత్రువులు ఆప్తులైనట్లుగా, ఆప్తులు శత్రువులైనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే వారిలో నిలకడలేదని విమర్శించారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ విషయంలో గతంతో పోలిస్తే మార్పులేవీ జరగలేదని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్ను ఎక్కువగా కొంటోందని, దీనివల్ల స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు.
బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నదంటే దాని వెనుక ఏదో మతలబు దాగి ఉందని కోదండరాం ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుండటం వల్ల కరెంటు అవసరంలేని సమయంలోనూ విద్యుత్ లైన్లకు డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతకుముందు కోదండరాం నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిసింది. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఆర్టీ)లో 50% మార్కుల విధానాన్ని ఎత్తేసి పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరింది.
శత్రువులు మిత్రులయ్యారు
Published Wed, Jan 3 2018 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement