ఉత్తరాంధ్రను దోచుకుంటున్న టీడీపీ | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రను దోచుకుంటున్న టీడీపీ

Published Thu, Jul 5 2018 2:27 AM

Pawan Kalyan fires on Chandrababu at public meeting in Pendurthi - Sakshi

పెందుర్తి: ఉత్తరాంధ్రను తెలుగుదేశం పార్టీ దోచుకుంటోందని జనసేన అధ్యక్షుడు కె.పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉంటారని టీడీపీ ప్రజాప్రతినిధుల తరఫున గత ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తే వారంతా ఇప్పుడు ప్రజలను దోచుకోవడం  తనను ఎంతో బాధకు గురిచేస్తోందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తిలో పవన్‌కల్యాణ్‌ బుధవారం పర్యటించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట దోపిడీకి గురైన ముదపాక భూములను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం ముదపాక, పెందుర్తి కూడలి వద్ద జరిగిన సభల్లో మాట్లాడుతూ అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక వారే దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట 965 ఎకరాల భూమిని దోచేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేయడం, ఇక్కడి బాధిత రైతుల కష్టాలు తెలుసుకుని తాను కలత చెందానన్నారు. టీడీపీ నాయకులే కాదు ఎంతటివారు వచ్చినా ముదపాకలో భూములు ఇవ్వొద్దని, బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెందుర్తి నియోజకవర్గ ప్రజలను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అతని కుమారుడు భయబ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నోళ్లు, ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.  

Advertisement
Advertisement