వడ్డెర్లను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

వడ్డెర్లను ఆదుకోవాలి

Published Fri, Feb 2 2018 6:14 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మా కులస్తులపై టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తో్తంది. మమ్మల్ని ఆదుకునేందుకు ఒక్క సంక్షేమ పథకమూ అమలు చేయడం లేదు. సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోవడం లేదు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మమ్మల్ని మీరైనా ఆదుకోవాలి’ అని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు గుజ్జి మాధవి, రామ తులసి, అరుణ వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వడ్డెర్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. జననేత స్పందిస్తూ మనందరి ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement