ఆరోగ్యశ్రీతో మా బిడ్డ బతికాడయ్యా! | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీతో మా బిడ్డ బతికాడయ్యా!

Published Mon, Feb 5 2018 7:05 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): అన్నా.. మాది ములుముడి గ్రామం, నా పేరు వెంకయ్య, భార్య పేరు పద్మావతి.. మా కుమారుడు ప్రణయకుమార్‌కు గతంలో గుండె వ్యాధి వచ్చింది.. నగదు పెట్టి ఆపరేషన్‌ చేయించే స్థోమత మాకు లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల మా బిడ్డకు ఆపరేషన్‌ చేయించాం’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలుతో మాలాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాయని జననేత వైఎస్‌ జగన్‌కు తెలిపారు. మీ కుటుంబం చల్లగా ఉండాలంటూ దీవించారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి ‘మీ అందరి ఆశీస్సులు ఉంటే మన ప్రభుత్వం వస్తుం దని, ఇంకా పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement