జీవో నంబర్‌ 41ని రద్దు చేయాలి | Sakshi
Sakshi News home page

జీవో నంబర్‌ 41ని రద్దు చేయాలి

Published Thu, Apr 12 2018 7:31 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు :రాజధానిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్‌ 41 ఎస్సీ రైతుల పాలిట శాపంగా మారిందని వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతు పులి ప్రభుదాసు బుధవారం ఎర్రబాలెం వద్ద ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి ఎస్సీలు పంటలు పండించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని అసైన్డ్‌ భూములు అంటూ 1000 చదరపు గజాలు కేటాయిస్తూ, మిగిలిన రైతులకు మాత్రం 1450 చదరపు గజాలు ఇస్తోందని తెలిపారు. అందరితో సమానంగా ఎస్సీ రైతులకు కూడా 1450 చదరపు గజాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జననేతను కోరారు.

Advertisement
Advertisement