‘వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన సీఎం’ | Sakshi
Sakshi News home page

‘వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన సీఎం’

Published Sun, Aug 12 2018 2:52 AM

Ponnam prabhakar commented over kcr - Sakshi

వేములవాడ: ముఖ్య మంత్రి కేసీఆర్‌ వేము లవాడ రాజన్నకే శఠగోపం పెట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం ప్రచార వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయిస్తామని సీఎం ఇచ్చిన హామీ నేటికీ  అమలు కాలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కొనసాగించే ఆందోళనల్లో భాగంగా ఈ నెల 18న పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు.  

Advertisement
Advertisement