ఢిల్లీ: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే ఊహాతీతంగా ఉందని, అన్నింటిలో తామే నంబర్ వన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ విమర్శించారు. క్రైమ్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ కరువయిందన్నారు. ఏపీలో రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, ప్రజలకు సరైన ఆహారం అందుబాటులో లేదని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో శాంతి ఎక్కడుందని బాబును సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. ఏపీ ప్రజలు ఏ రంగంలోనూ లాభపడలేదని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నదని తెలిపారు. డిసెంబర్ 29న విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ ఆఫీసుని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీలో చేరుదామని ఉత్సాహం ఉన్న వాళ్లు వైజాగ్ రావాలని కోరారు. 13 జిల్లాల్లో బూత్ లెవెల్ కమిటీ చర్చ జరుగుతుందని చెప్పారు.
మా ఒక్క పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, మిగతా పార్టీలు కుటుంబ పార్టీలు, కుల పార్టీలు అని తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాలు సృష్టించి నేను గొప్ప నేను గొప్ప అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్లోని పెద్ద నాయకులు నన్ను ప్రేత్యేకంగా కలుస్తున్నారని వెల్లడించారు. సేవ్ సెక్యులర్ ఇండియా అనే నినాదమే నా నినాదమని ఆయన చెప్పారు. చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ పరిస్థితి ఊహాతీతం : కేఏ పాల్
Published Tue, Dec 25 2018 4:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement