సాక్షి, కందుకూరు (ప్రకాశం) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నూకవరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
అత్తింటివారి పాలెం, బడేవారి పాలెం చేరుకుని అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం బొంతవారి పాలెం, కాకుటూరు, చేర్లోపాలెం, ప్రశాంతి నగర్ల మీదుగా కొనసాగుతుంది. ప్రశాంతి నగర్లో వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కందుకూరు చేరుకుని 91వ రోజు యాత్రను ముగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.