మేనిఫెస్టో కమిటీకి కూలీల సమస్యలు: నేరెళ్ల | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టో కమిటీకి కూలీల సమస్యలు: నేరెళ్ల

Published Mon, Oct 29 2018 2:59 AM

Problems of labor welfare for the Manifesto Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ వర్గాల ప్రజల సమస్యలను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అడిగి తెలుసుకున్నారు. ఆదివారం దినసరి వేతన కూలీలు, వీధి వ్యాపారులు, కార్మికులు, ఇళ్లు, హాస్టళ్లలో పనిచేసే తదితర కూలీలతో ఆమె గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. అలాగే హెచ్‌ఐవీ రోగులతోనూ ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా కాంగ్రెస్‌ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని, వారి సమస్యల్ని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీకి పంపుతున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement
Advertisement