సాక్షి,అమేధి: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బుధవారం తన నియోజకవర్గం అమేథిలో పర్యటించిన రాహుల్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.రైతులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని పరిష్కరించలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో వాటిని పరిష్కరిస్తుందని సవాల్ విసిరారు.
యూపీఏ ప్రభుత్వం చేపట్టిన జాతీయ ఉపాథి హామీ పథకాన్ని మోదీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రధాని తొలుత ఈ పథకం పనికిమాలినదని వ్యాఖ్యానించి ఆ తర్వాత మాటమార్చారని అన్నారు. ఏ అంశంపైనా బీజేపీ ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు.
విధాన నిర్ణయాలు తీసుకునే ముందు కాంగ్రెస్ ప్రజలతో సంప్రదించేందని, బీజేపీ మాత్రం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోదని ఆరోపించారు. రాహుల్ తన లోక్సభ నియోజకవర్గం అమేథిలో మూడు రోజులు పర్యటించనున్నారు.