Sakshi News home page

రాజ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు

Published Tue, May 15 2018 2:42 PM

Raj Thackeray Says Its Victory For Evms - Sakshi

సాక్షి, ముంబయి : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ఎంఎన్‌ఎస్‌ పెదవివిరిచింది. కర్ణాటక ఫలితాలపై ఆ పార్టీ చీఫ్‌ రాజ్‌ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితాలను ఈవీఎంల విజయంగా థాకరే అభివర్ణించారు. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈవీఎంలపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సందేహం వ్యక్తంచేసింది .

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్ల వినియోగానికి బీజేపీ ఎందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రశ్నించాయి. ‘ఈవీఎంలపై దేశంలోని పార్టీలన్నీ సందేహాలు వ్యక్తం  చేశాయి. గతంలో బీజేపీ సైతం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఎందుకు సిద్ధంగా లేద’ని కాంగ్రెస్‌ నేత మోహన్‌ ప్రకాష్‌ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement