కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ‘అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ పలాయనం చేసిందని విమర్శించే అర్హత మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాలవ శ్రీనివాసులుకు లేదు. దమ్ముంటే మా పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలి’ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్ ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఖూనీ చేస్తుండడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నిజాన్ని కప్పి పెట్టేందుకు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక.. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కష్టాలు తెలుసుకొని.. భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ యాత్రతో ఎక్కడ తమ పునాదులు కదులుతాయోనని అధికారపార్టీ నేతలకు భయం పట్టుకుందన్నారు.
ఆయన పేరుకే డిప్యూటీ సీఎం..
కేఈ కృష్ణమూర్తి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని..రెవెన్యూశాఖలో ఆయన మాట చెల్లుబాటు కాదని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గమైన పత్తికొండలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చెరువులు నింపుకోలేకపోయారన్నారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సీఎంను ప్రశ్నించలేని కేఈకి తమ పార్టీపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. సొంత సామాజికవర్గమైన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించలేని మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఇతరుల గురించి మాట్లాడే అధికారం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, శౌరీ విజయకుమారి, రమణ, భాస్కరరెడ్డి, రెహమాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
దమ్ముంటే వేటు వేయండి
Published Sat, Oct 28 2017 9:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement