మాకు ఎవరి పొత్తు అవసరం లేదు | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 10:24 AM

Sadananda Gowda Says No Question of Alliance with JDS - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు ఎవరి మద్దతు అవసరం లేదని బీజేపీ సీనియర్‌ నేత సదానంద గౌడ తెలిపారు. మంగళవారం ఆయన ఫలితాల్లో బీజేపీ అధిక్యం సాధించడంపై ఆనంద వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడారు. ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ ‌(112) దాటేసిందని, ఇప్పడు బీజేపీకి ఎలాంటి కూటములు అవసరం లేదని పేర్కొన్నారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 112 స్థానాల్లో దూసుకెళ్తుండగా..కాంగ్రెస్‌ 63 స్థానాల్లో, జేడీఎస్‌ 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement