సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తుకు రాష్ట్ర పోలీస్ సిబ్బందితోపాటు 6 రాష్ట్రాలు, పలు కేంద్ర బలగాల నుంచి భారీగా సిబ్బందిని రంగంలోకి దించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృ తం చేస్తూనే అక్కడి ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శాంతి భద్రతల విభాగం ఏడీజీ జితేందర్ వెల్లడించారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్లో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రభుత్వ విభాగాలు, కేంద్ర సంస్థలు, సరిహద్దు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం వంటి అంశాలను సమీక్షించుకుంటూ, పోలీస్ విభాగం అవసరాలకు తగ్గట్లు వ్యూహరచన చేసినట్లు చెప్పారు. 414 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 404 స్పెషల్ స్క్వాడ్స్, 3,385 సంచార బృందాలు పనిచేస్తున్నాయన్నారు. 4 వేల సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, అందులో నల్ల గొండ, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్ (కొడంగల్), కరీంనగర్ జిల్లాలున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించేందుకు 276 కేంద్ర బలగాలు (50వేల మంది), రాష్ట్ర పోలీసులు 30 వేల మంది, కర్నాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 20వేలమందిని రంగంలోకి దించినట్లు తెలిపారు. ఛత్తీస్గఢఖ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రూ.86.59 కోట్లు స్వాధీనం
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 11,853 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసినట్లు జితేందర్ వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 1,314 కేసులు నమోదు చేశామని తెలిపారు. బుధవారానికి రాష్ట్ర పోలీసువిభాగం రూ.86,59,84,575 నగదు, రూ.2,03, 93,582 విలువగల 47,069.62 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.6,70,08,873 విలువ చేసే 146.6 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు, 17.56 కిలోల బంగారం, 106.32 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.60,01,677 విలువ చేసే 266.59 కిలోల గంజాయి తదితర మత్తు పదార్థాలు, రు.1,62,43,375 విలువ చేసే బహుమతులూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తనిఖీల సందర్భంగా 17,841 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా 90,128 మందిని బైండోవర్ చేయడం, 8,481 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకోవడం, 11 అక్రమ ఆయుధాలు స్వాధీ నం చేసుకున్నామన్నారు. 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశామని తెలిపారు.
పలు జిల్లాలకు ఇన్చార్జి అధికారులు..
ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను జిల్లాలకు ఇన్చార్జి అధికారులుగా నియమించారు. వీరిలో హైదరాబాద్ జిల్లాకు ఐజీ మల్లారెడ్డి, శశిధర్రెడ్డి, వికారాబాద్కు శ్రీనివాసరావు, సిద్దిపేటకు స్వాతిలక్రా, సూర్యాపేటకు షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి జిల్లాకు పరిమళ హనానూతన్, షాద్నగర్ జానకీ షర్మిల, మేడ్చల్కు విజయ్కుమార్ను నియమించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఎన్నికల రోజు అదనపు డీజీపీలు, ఇతర ఐజీలు హెడ్క్వార్టర్స్లో అందుబాటులోఉండాలని, పోలీస్ శాఖ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
లక్ష మందితో భద్రత
Published Thu, Dec 6 2018 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement