శ్రీశైలం ప్రాజెక్ట్(కర్నూలు): రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం సున్నిపెంటలోని రెడ్ల కల్యాణ మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుపోయి, పార్టీలు మారే తత్త్వం తనది కాదని, ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా త్యాగం చేశానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే శ్రీశైలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల పెంపునకు ఈఓతో మాట్లాడానని తెలిపారు. సున్నిపెంటలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. టీడీపీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి చెందుతుందంటే అందులో తన కృషి , పట్టుదల ఉందన్నారు.
ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా?
శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో సమస్యలు తాండవిస్తున్నా.. పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శాశ్వత మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేక వైద్యం అంతంత మాత్రమే అందుతుందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి , నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామంలో వీధి లైట్లు లేవని, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయని, కరువు పనులు లేక పేదల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అప్రమత్తంగా ఉండాలి..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్య పెడుతున్నారని, నిరుద్యోగ భృతి పేరిట మోసం చేస్తున్నారని శిల్పా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, పార్టీ ›క్రియాశీలక కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు వట్టి వెంకటరెడ్డి, ఎమ్ఏ రజాక్, జింకా గుండయ్య యాదవ్, గవ్వల విష్ణు నారాయణ, హనుమన్న, కృష్ణమోహన్ రెడ్డి, గౌస్ మొహద్దీన్, ప్రభావతి, పార్వతి, కుమారి, శంకర స్వామి, వెంకటేశ్వర్లు, హమీర్బాషా, అయ్యప్ప, శేఖర్ సాహు, కొండబాబు, మల్లికార్జున, సోమేష్, మలిక్షా వలి, దాసు, డి.మల్లికార్జున , ఎస్కె ఆరీఫ్, కోదండం, చిన్న అబిబు, సుబ్బన్న, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
Published Thu, Aug 9 2018 11:33 AM
1/1
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement