కాంగ్రెస్‌ శకం ముగిసింది: శ్రీనివాస్‌గౌడ్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ శకం ముగిసింది: శ్రీనివాస్‌గౌడ్‌

Published Fri, Dec 1 2017 1:28 AM

srinivas goud on congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ శకం ముగిసిపోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునే ఓ శాఖ గాంధీభవన్‌లో ప్రత్యేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను కూడా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలు మంచి ఇళ్ల్లలో ఉండటం కాంగ్రెస్‌ నేతలకు ఇష్టం లేదని విమర్శించారు.

భూములపై కోర్టులకు పోయి పేదలకు, విద్యార్థులకు నష్టం చేసేలా కాంగ్రెస్‌ నాయకులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులందరూ సీఎం అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. మెట్రో రైలుపై కూడా కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని, మెట్రో చార్జీలను నిర్మాణ సంస్థ ఖరారు చేసేలా ఒప్పందం చేసుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించిన తీరు అద్భుతమని, ఇలాంటి మంత్రి తమకు లేరని పక్క రాష్ట్రాలు బాధపడుతున్నాయని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement