సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో నైరాశ్యం అలముకుంది! అసెంబ్లీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలకుతోడు రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తిప్పికొట్టలేకపోతోందన్న భావన కేడర్ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ మారుతున్నారంటూ రోజుకో నేత పేరు తెరపైకి వస్తుండటం, ఆ వార్తలను కొందరు ఖండిస్తున్నా మరికొందరు మౌనంగా ఉండటంతో పార్టీలో ఎవరుంటారో, ఎవరు వీడతారో అర్థంకాక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలోని ముఖ్య నాయకులకు గాలం వేస్తోందన్న వార్తలు కూడా కేడర్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలకు తోడు కొందరు నాయకులు రహస్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ను కలిశారన్న ప్రచారాన్ని ఎదుర్కొనే వ్యూహంలో కూడా పార్టీ రాష్ట్రశాఖ వెనుకబడటం గమనార్హం.
నిజంగానే టచ్లో ఉన్నారా..?
రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన సతీమణి పద్మినిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే శశిధర్రెడ్డితోపాటు రాజనర్సింహ తాము బీజేపీలో చేరడం లేదని, అలాంటి ప్రస్తావనే రాదని కొట్టిపారేశారు. కానీ సుదర్శన్రెడ్డి మాత్రం ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు. దీనికితోడు గత ఎన్నికలకు ముందే రాజనర్సింహ సతీమణి పద్మిని బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆమెపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మరో నేత, మెదక్ జిల్లా నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన ఓ అభ్యర్థి, టీపీసీసీలో కీలక పదవిలో ఉన్న మహిళా నాయకురాలు ఒకరు బీజేపీతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నా ఆ నాయకులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాము బీజేపీలోకి వెళుతున్నామని తమ కేడర్తో కూడా చర్చించకుండానే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
భారీ చేరికలా?
ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన కూడా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తుండటంతో కమలదళంలోకి భారీగా చేరికల కార్యక్రమం కూడా ఉంటుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ వర్గాలు మాత్రం చేరికలుంటాయని చెబుతున్నాయే కానీ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీలోకి వెళతానని చెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితోపాటు టీఆర్ఎస్ అసంతృప్త నేత వివేక్ తదితరులు కాషాయ కండువాలు కప్పుకోవచ్చని, వారికి మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా తోడవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజగోపాల్రెడ్డి చేరిక సాంకేతికంగా ఇబ్బందికరమైందని బీజేపీ అధిష్టానమే చెబుతోందని, ఈ కారణంతో ఆయన చేరిక కొంత ఆలస్యం కావచ్చని సమాచారం.
ఖాళీ చేయడమేమో కానీ...
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ డిసెంబర్కల్లా గాంధీ భవన్ను ఖాళీ చేయించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని చెబుతుండగా ఖాళీ చేయడమేమోకానీ మానసికంగా ఇబ్బందుల్లో పడేసే పనిలో మాత్రం బీజేపీ సక్సెస్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కారణంగానే కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడిపోతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, కావాలనే కొందరు నేతల పేర్లను ప్రచారంలో పెట్టి వారంతా తమ పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలను పంపడం ద్వారా మైండ్గేమ్ ఆడుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ దీన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది వేచిచూడాల్సిందే.
గంభనంగా కాంగ్రెస్...
పార్టీ నుంచి నాయకులంతా వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం గంభనంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని గట్టిగా నమ్ముతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తమకన్నా ఒక సీటు అదనంగా వచ్చినా ఓట్ల శాతం మాత్రం బీజేపీకన్నా దాదాపు 10 శాతం తమకే ఎక్కువగా వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు భవిష్యత్తులో తామే ప్రత్యామ్నాయం కాగలమని, నేతలెవరూ పార్టీని వీడరని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది. క్యాడర్ సైతం ఇదే నమ్మకంతో ఉందని పేర్కొంటోంది. ఒకవేళ ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా ప్రతిపక్షంగా మాత్రం తామే నిలబడగలమని ధీమాగా ఉంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
Related news
-
నేడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో... బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్–మెదక్ జనసభలో ప్రధాని పాల్గొంటారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎం.రఘునందన్ రావులకు మద్దతుగా అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే విషయాలను మోదీ ప్రస్తావిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 (బుధవారం) హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మూడు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
అమిత్ షా డీప్ఫేక్ వీడియో కేసులో రేవంత్కు నోటీసులు.. సీఎంకు ఫేక్ ‘షా’క్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నట్టుగా వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన, షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డికి, పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీడియోను షేర్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ (మొబైల్/ల్యాప్టాప్/ట్యాబ్లెట్)తో సహా మే 1వ తేదీన స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నవారిలో టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీం ఉన్నారు. వీరికి సంబంధించిన నోటీసులను గాందీభవన్లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. రేవంత్కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి పేరిట 91/160 సీఆర్పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో ఇచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్.. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు కూడా. సిద్దిపేటలో మాట్లాడిన వీడియో డీప్ ఫేక్తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్ఫేక్తో మార్ఫింగ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, రేవంత్ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్ అయింది. ఉదయమే గాంధీభవన్కు సమాచారం అమిత్ షా డీప్ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారని సోమవారం ఉదయమే గాం«దీభవన్కు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఎఫ్ఎస్ఓ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి నేతృత్వంలోని బృందం గాం«దీభవన్కు చేరుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వారి తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి, అడ్వొకేట్ రామచంద్రారెడ్డి ఆ నోటీసులను తీసుకున్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారని రామచంద్రారెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు అని ఇన్స్పెక్టర్ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తమకు పంపాలని.. పూర్వాపరాలు పరిశీలించి ముందుకు వెళ్తామని, ఇందుకోసం 15 రోజుల గడువు కావాలని ఇన్స్పెక్టర్ను రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞప్తిని అందజేశారు. దీనితో ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతల ఆగ్రహం ఢిల్లీ పోలీసులు గాం«దీభవన్కు వచ్చిన విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ నాయకురాలు శోభారాణి తదితరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టారు. ఏ వీడియోను ఎవరు, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారో తెలియకుండా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేకుండా గాం«దీభవన్కు వచ్చి నోటీసులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ఐటీ చట్టం, సీఆర్పీసీల కింద కేసు నమోదు చేసి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియో విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)’ని ఆదేశించింది. ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ ఆదివారమే ఢిల్లీ ‘ఇంటెలిజెన్స్ ఫ్యూజియన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ)’ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్ 66సీ, ఐపీసీలోని 153/153ఏ/465/469/171జీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 177/24) నమోదు చేసింది. అమిత్ షా వీడియోను డీప్ఫేక్ మార్ఫింగ్ చేసిందెవరు? ‘ఎక్స్’, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసిందెవరనే దానిపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా 91/160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టారు. ఫేస్బుక్, ‘ఎక్స్’లకూ నోటీసులు ఈ వీడియో వ్యవహారానికి సంబంధించి ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు కూడా స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఆ వీడియోను మొదట పోస్ట్ చేశారు? ఇప్పటివరకు ఎందరు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారనే వివరాలను వెబ్ లింకులతో సహా ఇవ్వాలని ఆదేశించారు. స్పెషల్ సెల్కు చేసిన ఫిర్యాదులో ఏముంది? ‘‘ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన వీడియోను మార్చేసి (డీప్ఫేక్, ఎడిట్, బోగస్ చేసి) కొందరు వ్యక్తులు ఎక్స్, ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి అమిత్ షా మాట్లాడినది వేరు, వాళ్లు పోస్ట్ చేసిన ప్రసంగం వేరు. ఏయే పేజీల్లో (ఎక్స్, ఫేస్బుక్) ఆ వీడియోను పోస్ట్ చేశారనేది లింకులతో సహా ఇస్తున్నాం. సమాజాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. అందుకే వాళ్లు అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ అసత్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని, వాటికి సంబంధించిన ఇన్చార్జులు, నకిలీ వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని స్పెషల్ సెల్కు చేసిన ఫిర్యాదులో ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్లో పోస్టు చేశారన్నది రేవంత్పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్ఫేక్లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ను జోడిస్తూ డీప్ ఫేక్లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్ఫేక్లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. రాప్తాడులో రెబల్ పోటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్ కుమార్ రెబల్గా పోటీలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్ పసుపులేటి సుధాకర్ బరిలో దిగారు. సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం టీడీపీకి సంకటంగా మారింది. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్ అభ్యర్థి యాతాటి రమేష్బాబు బెంబేలెత్తిస్తున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్నాయుడు పోటీలో ఉన్నారు.రఘురామ గుండెల్లో రైళ్లు అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్ రెబల్గా బరిలోకి దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్కుమార్ పోటీలో నిలిచారు.టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తువిజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్గా నామినేషన్ వేశారు. అశోక్గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్ కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.ఫలించని సీఎం రమేష్ పైరవీలుఅనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్గా ప్రకటించి ఇండిపెండెంట్లకు కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్ వేశారు. తనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. -
ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు వైఎస్ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.సెక్యులర్ లీడర్ జగన్కు అండగా నిలవండి సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
Related News by category
-
నేడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో... బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్–మెదక్ జనసభలో ప్రధాని పాల్గొంటారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎం.రఘునందన్ రావులకు మద్దతుగా అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే విషయాలను మోదీ ప్రస్తావిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 (బుధవారం) హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేవిధంగా మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మూడు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
పింఛన్లపై బాబు కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: వృద్ధులకు పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా 1వ తేదీనే సూర్యోదయానికి ముందే ఇంటింటికీ పింఛన్ తీసుకెళ్లే వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని వృద్ధులను మండుటెండలో నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.సీఎం జగన్ తీసుకొచి్చన సచివాలయ వ్యవస్థలోని 1.30 లక్షల మంది ఉద్యోగులతోనే పింఛన్లను ఇంటింటికీ పంపాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. పింఛన్లు పేదల ఇంటికి వెళ్లకుండా ఆపించిన చంద్రబాబే.. ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చెబుతారని నిలదీశారు. ఈసీ ఆదేశాలతో వీలైనంత త్వరగా పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సజ్జల సోమవారం తాడేపల్లిలోకి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అహంకారంతో, ఎల్లో మీడియా అండతో చంద్రబాబు ఎన్నికల కమిషన్ను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు కూడా అప్పటి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని నేరుగానే బాబు బెదిరించారు. వృద్ధుల కష్టాలను దగ్గరుండి చూసిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ పింఛన్ పంపిణీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. దీనిని చంద్రబాబు అడ్డుకొన్నారు. దీంతో డీబీటీ ద్వారా పంపిణీ చేయాలని ఈసీ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి కూడా బాబు ఒప్పుకోలేదు. చంద్రబాబు గ్యాంగ్, ఢిల్లీలో ఏజెంట్లతో ఈసీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏప్రిల్ 26న ఈసీ మరో లేఖ రాసింది. ఇందులో కూడా డీబీటీ ద్వారా ఇవ్వాలని చెప్పింది. ప్రభుత్వ యంత్రాంగం డీబీటీ ద్వారా, ఇళ్ల వద్ద పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు మళ్లీ బ్యాంకుల ద్వారా కాదు, ఇంటికే వెళ్లి ఇవ్వాలంటూ ఈసీకి బాబు హుకుం జారీ చేయడం సిగ్గుచేటు. పింఛన్ కోసం ప్రజలు మళ్లీ రోడ్డెక్కాల్సి రావడానికి బాబే కారణం. ఈ పాపానికి బాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి బాధ్యులు. 32 మంది వృద్ధులను పొట్టన పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నదీ చంద్రబాబే’ అని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ఒకట్రెండు నెలలు అడ్డుకుంటే అభిమానం తగ్గిపోతుందా? బాబు పాలనలో పింఛన్ కోసం వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. వచ్చే కొద్దిపాటి పింఛన్ ఎప్పుడు, ఎంత మందికి వస్తుందో తెలీదు. అలాంటి చంద్రబాబు.. పింఛన్లను ఇంటి వద్దే అందిస్తున్న సీఎం జగన్ను ప్రశి్నస్తున్నాడు. ఆయనే పంపిణీ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్న వలంటీర్లకు సమాజంలో దక్కిన గౌరవాన్ని చూసి బాబులో వణుకు పుట్టింది. స్వయంగా పింఛన్ పంపిణీని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారనే భయంతో దొంగ ఎత్తులు వేశారు. బినామీలతో సుప్రీం కోర్టులో కేసులు, ఫిర్యాదులతో అడ్డుకున్నారు. సీఎం జగన్ ప్రజలకు భరోసా ఇచ్చే పథకాలు తెచ్చారు కాబట్టే వలంటీర్లకు ఆదరణ పెరిగింది.చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడు? చంద్రబాబు నిస్పృహలో తప్పులు చేసి,సీఎం జగన్ను తిట్టడాన్ని చూస్తే బాబు అసలు మనిషి జన్మ ఎలా ఎత్తాడా అనిపిస్తోంది. బాబులో ఆయన తల్లిదండ్రులే సిగ్గుపడే అవలక్షణాలున్నాయి. వాటిని సీఎం జగన్కు ఆపాదించడం దుర్మార్గం. ప్రజలకు మంచి చేసే దమ్ములేక సంధి ప్రేలాపనలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిని చంపితే ఏమవుతుందని అనడమే ఇందుకు నిదర్శనం. తుని ఘటనలో కాపులపై కేసులు పెట్టింది చంద్రబాబే. రైలు ఎవరు తగలబెట్టారో పవన్ కళ్యాణ్ ఆయన అన్న చిరంజీవిని అడిగితే బాగుంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూమలు దోచేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో చంద్రబాబ ఐఎంజీ భారత్కు 800 ఎకరాలు దోచిపెట్టే ప్రయత్నం చేసినట్టు అందరూ చేస్తారనుకోవడం అవివేకం. చంద్రబాబు వల్లే చుక్కల భూముల గందరగోళం వచ్చింది. చాలా మంది రైతుల భూములు పోయాయి. సీఎం జగన్ వచి్చన తర్వాత 3 లక్షల చుక్కుల భూమలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కలి్పంచి, యాజమాన్య హక్కులు ఇచ్చారు. చంద్రబాబుది దోపిడీ చేసే చెయ్యి. సీఎం జగన్ది ఇచ్చే చెయ్యి. షర్మిలమ్మ తెలంగాణలో మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. 13వ తేదీ తర్వాత మళ్లీ కనబడరు.బాబు సీఎంగా ఉండగా 2017 జూలై 1న చీరాల సమీపంలోని ఈపురుపాలెంలో పింఛన్ కోసం వృద్ధులు క్యూలైన్లలో అవస్థలు పడుతున్న వీడియోను సజ్జల ప్రదర్శించారు. ఉదయం 6.30 గంటలకే పింఛన్ కోసం మహిళలు, వృద్ధులు క్యూలో బారులు తీరడం ఇందులో కనిపించింది. ‘సక్రమంగా ఉంటే చూస్తా.. లేకపోతే చూడను’ అంటూ లైన్లో ఉన్న వృద్ధులపై జన్మభూమి కమిటీ సభ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 11 దాటినా పది మందికి కూడా పింఛన్ ఇవ్వలేదని వృద్ధులు వాపోతున్నారు. నిలువ నీడలేక, గుక్కెడు మంచి నీళ్లు లేక, సొమ్మసిల్లి పడిపోయిన ఎన్నో హృదయ విదారక ఘటనలకు వీడియో సాక్షిగా నిలిచింది. -
కేంద్రంలో సంకీర్ణం.. బీఆర్ఎస్ కీలకం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కేంద్రంలో బీజేపీ గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి 400, 370 సీట్లు ఏమీ వస్తలేవు. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. రాష్ట్రంలో ఇవ్వాళ ఆరో రోజు యాత్ర చేశా. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 12 పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారనుంది. మీరు నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే సంకీర్ణంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. నరేంద్రమోదీ దాడి నుంచి, చేతకాని, చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా.. కృష్ణాను రక్షించుకోవాలన్నా.. మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా.. హక్కులు సాధించుకోవాలన్నా. బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతుంది..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సుయాత్ర సోమవారం వరంగల్ నుంచి తిరుమలాయపాలెం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ సెంటర్లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీజేపీ వాళ్లకి తెలంగాణ సమస్యలు పట్టవు ‘తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే పరిస్థితికి తీసుకెళ్లాం. 3.50 కోట్ల టన్నుల వడ్లు పండించాం. కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొనమని మొండికేసింది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో నాడు ఎంపీలు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి ధాన్యం కొనమని అడిగారు. యాసంగిలో కొంచెం నూక అవుతుందని మంత్రికి చెప్పారు. అయితే ఆ మెదడు తక్కువ మంత్రి.. మీ తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అని చెప్పారు. దీనిని నిరసిస్తూ మొత్తం తెలంగాణ కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ నోరు కూడా తెరవలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ సమస్యలు వారికి పట్టవు..’అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ‘గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లు ఇస్తామని మోదీ క్లియర్గా చెబుతుండు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉన్నడు. ముగ్గురు ఎంపీలున్నరు. బీజేపీ ఉంది. వీళ్లేం చేస్తున్నరు. ఒక్కరైనా మాట్లాడుతున్నరా? రాష్ట్రాన్ని ఎండగడతామని మోదీ మాట్లాడుతుంటే వీరికి ఉలుకు, పలుకు లేదు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో కూడా మోదీ ఇదే ప్రతిపాదన తెచ్చారు. కానీ మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాక ..మా వాటా మాకు అక్కడ పెట్టేదాక ఎట్టి పరిస్థితుల్లో, నా తల తెగినా ఒప్పుకోనని చెప్పినా.. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ.. వీళ్లకు ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కేంద్ర మంత్రులు కావాలి.. కానీ తెలంగాణ సమస్యలు, ప్రధానమైన సమస్యలు నీళ్లు, రైతులు, పంటలు వీళ్లకు పట్టదు..’అని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ నోటికి మొక్కాలి ‘మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆయన నోటికి మొక్కాలి.. వెనకట కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పేది.. దున్నేవాడికే భూమి.. తినేవాడికే విస్తరి.. గీసేవాడికే గుండు.. అమ్మను చూడు ఆవుదూడ బొమ్మను చూడు.. గుద్దో గుద్దు అని. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టెడు అన్నం దొరికింది ఆ పుణ్యాత్ముడు చేపట్టిన కిలో రూ.2 బియ్యం ద్వారానే. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది చరిత్ర..’అని బీఆర్ఎస్ అధినేత వివరించారు. తులం బంగారం తుస్సుమంది ‘తెలంగాణ రావడంతో ఎన్టీఆర్ చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు ఇలా అన్నీ చేసుకున్నాం. కుంట భూమి ఉన్నా రైతు చనిపోతే వారం లోపు వారి ఇంటికి రూ.5 లక్షలు పంపాం. కల్యాణలక్ష్మి, పెట్టుకున్నాం. అయితే రూ.లక్ష మాత్రమే ఇస్తున్నారు..నేను తులం బంగారం ఇస్తానని రేవంత్రెడ్డి అన్నడు.. తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటోంది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటోంది. తొమ్మిదేళ్లు రెప్పపాటు పోకుండా ఉన్న కరెంట్ నాలుగు నెలల్లో మాయమైపోతదా? నిన్న మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందని నేను ట్విట్టర్లో పెట్టా. ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వట్టి విక్రమార్క. కరెంట్ పోయిందంటే కేసీఆర్ అబద్ధాలకోరు అంటున్నడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత ఉంది.. కరెంటు కోతలు ఉన్నాయి. హాస్టళ్లు మూసేస్తున్నామని చీఫ్ వార్డెన్ నోటీసు ఇచ్చింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి కోతలుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి..’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి ‘రూ.2 లక్షల రుణమాఫీ అని రేవంత్రెడ్డి అన్నడు. డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తానన్నడు. అయ్యిందా? భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు అంటావు.. ఇలా ప్రజలను మోసం చేయడానికి ఎన్ని ఒట్లు పెడతావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి. ప్రతి మహిళకు రూ.2500 వచ్చిందా? వచ్చే ఆశ ఉందా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతోంది. ఈ మోసాలపై శాసనసభలో, బయట సభల్లో బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేసీఆర్ నీ గుడ్లు పీకుతా, పండపెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైల్లో వేస్తానని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నడు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషా ఇది?. పార్లమెంట్ ఎన్నికలైన తెల్లారే రేవంత్రెడ్డి బీజేపీలోకి జంప్ కొడతాడని బీజేపీ వాళ్లే చెబుతున్నరు. ఈ మాటలను ఆయన ఒక్కసారి కూడా ఖండించడం లేదు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భయంకరమైన రాజకీయ అనిశ్చితి రానుంది..’అని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. నాడు ఖమ్మం బ్రహ్మరథం పట్టింది ‘నేను ఒక్కడిని బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు తెలంగాణ వస్తదని. నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆనాడు ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూడెమోక్రసీ, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు, తెలంగాణ వాదులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు పలికారు. అది నేను మర్చిపోలేదు. చివరికి తెలంగాణ వచ్చింది. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభివృద్ధిని చేసి చూపించిండు. నగరంలో నాడు రోజూ మంచినీళ్లు వస్తే.. ఇప్పుడు మూడురోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయి. తమ భూములకు నీళ్లు కావాలని పాలేరు రైతులు తూములు బద్ధలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంటలు ఎండిపోతుంటే నీటి మంత్రి, వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నరు? అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. మీ కోరికలు నెరవేరాలంటే బీఆర్ఎస్కు శక్తి కావాలి. రాష్ట్రాన్ని, ఖమ్మంను ముందుకు తీసుకెళ్లే బలం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగింది. మళ్లీ విజృంభిద్దాం.. అభివృద్ధి చేసుకుందాం..’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోతు హరిప్రియ, బానోతు మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, దేశపతి శ్రీనివాస్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ మీరే రావాలె సారు – కేసీఆర్తో రైతులు, వృద్ధులు, మహిళలు – ఖమ్మం మార్గంలో చాయ్ హోటల్ వద్ద బస్సు యాత్రకు బ్రేక్ మరిపెడ రూరల్: ‘మీరు లేకపోవుడుతోటి ఇన్ని కష్టాలు సారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయినం.. ఇట్లైతదని అనుకోలే సారు .. మళ్లా మీరే రావాలె సారు..’అంటూ పలువురు రైతులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, తాను అండగా ఉంటానని చెబుతూ వారిని ఓదార్చారు. బస్సుయాత్రలో భాగంగా హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్ మార్గం మధ్యలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న చిన్న చాయ్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. కేసీఆర్ను చూసి హోటల్ యజమాని సొందు, కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హోటల్లో ఉన్న మిర్చి బజ్జి, పకోడి, గారెలను ఆయనకు అందించారు. వాటిని తిన్న కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. సమాచారం అందుకున్న ఆనెపురం మాజీ సర్పంచ్ లాల్సింగ్ తదితరులు ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరుకున్నారు. కొందరు రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, యాసంగికి సాగు నీళ్లు అందక పొలాలు ఎండిపోయాయని, కరెంట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రైతుబంధు సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. కాగా పలువురు యువతీ యువకులు కేసీఆర్తో సెల్ఫీలు దిగారు. మరిపెడ మండల కేంద్రంలో బస్సుయాత్రకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
అమిత్ షా డీప్ఫేక్ వీడియో కేసులో రేవంత్కు నోటీసులు.. సీఎంకు ఫేక్ ‘షా’క్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నట్టుగా వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన, షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డికి, పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీడియోను షేర్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ (మొబైల్/ల్యాప్టాప్/ట్యాబ్లెట్)తో సహా మే 1వ తేదీన స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నవారిలో టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీం ఉన్నారు. వీరికి సంబంధించిన నోటీసులను గాందీభవన్లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. రేవంత్కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి పేరిట 91/160 సీఆర్పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో ఇచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్.. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు కూడా. సిద్దిపేటలో మాట్లాడిన వీడియో డీప్ ఫేక్తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్ఫేక్తో మార్ఫింగ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, రేవంత్ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్ అయింది. ఉదయమే గాంధీభవన్కు సమాచారం అమిత్ షా డీప్ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారని సోమవారం ఉదయమే గాం«దీభవన్కు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఎఫ్ఎస్ఓ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి నేతృత్వంలోని బృందం గాం«దీభవన్కు చేరుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వారి తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి, అడ్వొకేట్ రామచంద్రారెడ్డి ఆ నోటీసులను తీసుకున్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారని రామచంద్రారెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు అని ఇన్స్పెక్టర్ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తమకు పంపాలని.. పూర్వాపరాలు పరిశీలించి ముందుకు వెళ్తామని, ఇందుకోసం 15 రోజుల గడువు కావాలని ఇన్స్పెక్టర్ను రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞప్తిని అందజేశారు. దీనితో ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతల ఆగ్రహం ఢిల్లీ పోలీసులు గాం«దీభవన్కు వచ్చిన విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ నాయకురాలు శోభారాణి తదితరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టారు. ఏ వీడియోను ఎవరు, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారో తెలియకుండా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేకుండా గాం«దీభవన్కు వచ్చి నోటీసులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ఐటీ చట్టం, సీఆర్పీసీల కింద కేసు నమోదు చేసి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియో విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)’ని ఆదేశించింది. ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ ఆదివారమే ఢిల్లీ ‘ఇంటెలిజెన్స్ ఫ్యూజియన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ)’ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్ 66సీ, ఐపీసీలోని 153/153ఏ/465/469/171జీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 177/24) నమోదు చేసింది. అమిత్ షా వీడియోను డీప్ఫేక్ మార్ఫింగ్ చేసిందెవరు? ‘ఎక్స్’, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసిందెవరనే దానిపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా 91/160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టారు. ఫేస్బుక్, ‘ఎక్స్’లకూ నోటీసులు ఈ వీడియో వ్యవహారానికి సంబంధించి ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు కూడా స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఆ వీడియోను మొదట పోస్ట్ చేశారు? ఇప్పటివరకు ఎందరు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారనే వివరాలను వెబ్ లింకులతో సహా ఇవ్వాలని ఆదేశించారు. స్పెషల్ సెల్కు చేసిన ఫిర్యాదులో ఏముంది? ‘‘ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన వీడియోను మార్చేసి (డీప్ఫేక్, ఎడిట్, బోగస్ చేసి) కొందరు వ్యక్తులు ఎక్స్, ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి అమిత్ షా మాట్లాడినది వేరు, వాళ్లు పోస్ట్ చేసిన ప్రసంగం వేరు. ఏయే పేజీల్లో (ఎక్స్, ఫేస్బుక్) ఆ వీడియోను పోస్ట్ చేశారనేది లింకులతో సహా ఇస్తున్నాం. సమాజాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. అందుకే వాళ్లు అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ అసత్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని, వాటికి సంబంధించిన ఇన్చార్జులు, నకిలీ వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని స్పెషల్ సెల్కు చేసిన ఫిర్యాదులో ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విశ్వసనీయతే విజయానికి మెట్టు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులో.. సర్వే సంస్థలో చెబుతున్న మాటకాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గొంతులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మరింతగా పెంచి వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలను కొనసాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని అందులో ఆయన స్పష్టంచేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టిన చంద్రబాబు.. కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోయిన హామీలకే ‘సూపర్ సిక్స్’ అని ముసుగేసి.. తల్లికి వందనం పథకం కింద ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామంటూ రోజూ హామీల పాట పాడుతున్నారు. చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో పది నెలలుగా ఆయన ఊదరగొడుతున్న ఈ హామీలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అదే సమయంలో.. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ఈ నమ్మకమే వైఎస్సార్సీపీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. వైఎస్ విశ్వసనీయతకే పెద్దపీట.. 2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాట మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించడం, వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీచేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు.. ఆరోగ్యశ్రీ వంటి ఇవ్వని హామీలను కూడా అమలుచేసి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో.. 2004 నాటి హామీల అమలును కొనసాగిస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని.. ప్రతినెలా ఒకరికి నాలుగు కేజీల చొప్పున ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఇస్తామంటూ కొత్తగా రెండే హామీలిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అంటూ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా దిగారు. వైఎస్కు ఉన్న ప్రజాబలం చూసి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి పారేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబం ఖాతాలో ప్రతినెలా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ (డీబీటీ) కింద జమచేస్తామన్నారు. కానీ, 1995–2004 వరకూ బాబు మోసాలు, అరాచకాలను గుర్తుంచుకున్న ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టంకట్టారు. చరిత్ర పునరావృతం ఖాయం.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు.. రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగభృతిగా రూ.2 వేలు ఇస్తానంటూ 650కి పైగా హామీలను ఎడాపెడా గుప్పించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయంచేశారు. అందులోని ఒక్కదాన్నీ అమలుచేయకుండా వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఆ ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలను అమలుచేశారు. నవరత్నాలు పథకాలు కింద డీబీటీ రూపంలో 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలైన విద్యాకానుక, గోరుముద్ద, వసతిదీవెన వంటి హామీలను అమలుచేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించేందుకు వచ్చే ఐదేళ్లూ నవరత్నాల పథకాలను విస్తరించి, కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమ్మఒడిని రూ.15 వేలను రూ.17 వేలకు.. రైతుభరోసాను రూ.13,500లను రూ.16 వేలకు.. పెన్షన్ను రూ.3 వేల నుంచి రూ.3,500లకు పెంచుతామని హామీనిస్తూ మళ్లీ రెండే పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో మళ్లీ జట్టుకట్టి సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో పాట పాడుతున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు పేర్కొన్న హామీలన్నీ కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడాన్ని ప్రజలు తెలుసుకున్నారు. దీంతో అడ్డగోలు హామీలిచ్చేస్తున్నారు. అయినా.. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాటపై నిలబడే సీఎం వైఎస్ జగన్కే మరోసారి పట్టం కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. 2009 నాటి చరిత్ర పునరావృతం కావడం ఖాయమంటున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement