సైకిల్‌ మీద నుంచి పడిపోయిన తేజ్‌ | Sakshi
Sakshi News home page

సైకిల్‌ మీద నుంచి పడిపోయిన తేజ్‌

Published Thu, Jul 26 2018 3:14 PM

Tej Pratap Yadav Tumbled In Bicycle Rally - Sakshi

బిహార్‌ : బిహార్‌ రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) నేత తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సైకిల్‌ తొక్కుతూ పట్టుకోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటన గురువారం పాట్నాలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్‌ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్‌ పెంచారు.

తేజ్‌ ప్రతాప్‌ వేగంగా సైకిల్‌ను తొక్కడంతో కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కూడా ఆయన్ను అనుసరించేందుకు యత్నించారు. ఈ లోగా ఎదురుగా వచ్చిన టర్న్‌ వద్ద సైకిల్‌ను అదుపు చేయలేక తేజ్‌ ప్రతాప్‌ కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను లేవదీశారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

మళ్లీ సైకిల్‌ను తీసుకున్న తేజ్‌ ప్రతాప్‌ యాత్రను కొనసాగించారు. సైకిల్‌ యాత్రపై మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెరగడం వల్ల దగ్గరి ప్రయాణాలకు ప్రజలు సైకిల్‌ను వినియోగించాలని కోరారు. సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.

Advertisement
Advertisement