సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనభ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం రాత్రి జరిగిన ఈ భేటీలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా పాల్గొన్నారు. దీంతో ప్రెస్కాన్ఫరెన్స్ పేరుతో హస్తినకు చేరుకున్న చంద్రబాబు పర్యటన వెనక అసలు ఉద్దేశం కూడా సీట్ల విషయంపై చర్చించడమేనని స్పష్టమైంది. శనివారంరాత్రి ఏపీ భవన్లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీపీఐకి 5, టీజేఎస్కు 8, టీటీడీపీకి 15 సీట్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ 91 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశం అనంతరం చంద్రబాబు, ఉత్తమ్లు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
సిటీ సీట్లపైనే చర్చ!: భాగ్యనగరంలోని పలు సీట్లలో సెటిలర్ల ఎక్కువగా ఉన్నందున ఆ స్థానాలు తమకే కేటాయించాలని టీడీపీ మొదట్నుంచీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ తమకు కూడా బలముందని కాంగ్రెస్ వాదిస్తోంది. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, పటాన్చెరు, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ స్థానాలపై సందిగ్ధత నెలకొంది. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని పి.విష్ణువర్ధన్ రెడ్డికి కేటాయించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇలా ప్రతిస్థానంపైనా ఏదో ఒక చిక్కుముడి నెలకొంది.
ఈ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. పోల్ మేనేజ్మెంట్పైనా ఉత్తమ్, బాబు చర్చించారని తెలుస్తోంది. అంతకుముందు ఏపీ భవన్లోనే చంద్రబాబును.. సీపీఐ పార్టీ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా, నారాయణలు కలిశారు. కాగా, జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ అభిప్రాయాలను గౌరవించేందుకు వీలుగా తామే కాస్త తగ్గామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్కు పూర్తిగా సహకరించాలంటూ ఎల్ రమణకు చంద్రబాబు సూచించారు.
బాబుతో ఉత్తమ్ భేటీ
Published Sun, Oct 28 2018 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement