40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వాటే గ్రేట్ ఫాల్! | Sakshi
Sakshi News home page

40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వాటే గ్రేట్ ఫాల్!

Published Sun, Apr 12 2020 11:25 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐదు కోట్ల ప్రజల తరపున మాట్లాడాల్సిన చంద్రబాబు కేవలం ముగ్గురి ఉద్యోగాల కోసం పాటుపడుతున్నారంటూ దుయ‍్యబట్టారు. కాగా తన ట్వీట్‌లో 'ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల ప్రజానీకం తరపున మాట్లాడాల్సిన వ్యక్తి భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తన పరిధిని తనే కుదించుకుంటూ పోతున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!' అంటూ  విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: ఆయన ఎక్కించే ఎల్లో వైరస్‌ ఎంత డేంజరంటే!

మరో ట్వీట్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు చురకలంటించారు. 'కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దు’

Advertisement
Advertisement