మిర్యాలగూడ : టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు.
నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు.
టీఆర్ఎస్కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Related news
-
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ముస్లిం నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అరిఫ్ ఖాన్ లేఖ రాశారు. ప్రతిపక్ష కూటమి మమా వికాస్ అఘాడీ కూటమి ముస్లిం అభ్యర్ధిని నిలబెట్టనందుకు లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయలేనని లేఖలో తేల్చి చెప్పారు.‘మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎంవీఏ కూటమి ఒక్క ముస్లిం అభ్యర్ధికి కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం అనేక ముస్లిం సంస్థలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్లు మైనారిటీ కమ్యూనిటీ నుంచి కనీసం ఎక్క నేతనైనా అభ్యర్ధిగా ఆశిస్తారు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నన్ను ‘కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు కావాలి, కాని అభ్యర్థులు ఎందుకు వద్దు’ అని అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేస్తున్నాను’ అని ఖాన్ లేఖలోపేర్కొన్నారు.కాగామహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ (శరద్చంద్ర పవార్)తో కలిసి పోటీ చేస్తోంది. అయితే ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించారు. కానీ నగర యూనిట్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ను ఖరారు చేసింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని చండీవాలి నుంచి పోటీ చేసిన ఖాన్.. కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చదవండి: ఆ పోలింగ్ బూత్లో జీరో ఓటింగ్.. కారణమిదే? -
తెలంగాణను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరిక..ఇంకా ఇతర అప్డేట్స్
-
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
మెదక్ మొనగాడెవరు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ఉంది. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాం«దీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వంటి కాకలుతీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలో దింపగా, వారు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు..విమర్శలు.. ప్రతివిమర్శలతో మెదక్ పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం మీద ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగుతోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, బీఆర్ఎస్ ఐదు పర్యాయాలు (ఉప ఎన్నికతో కలిపి) గెలిచాయి. బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్, టీపీఎస్ ఒక్కోసారి విజయం సాధించాయి.పట్టు నిలుపుకునేందుకు గులాబీ 2004 నుంచి రెండు దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. ఈసారి కూడా ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి.వెంకట్రాంరెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. గెలుపు బాధ్యత మాజీ మంత్రి హరీశ్రావు తన భుజాలపై వేసుకొని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాలను పునరావృతం చేసేందుకు బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పాగా వేసేందుకు బీజేపీ యత్నం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఒకేఒక దుబ్బాక సీటును కోల్పోయి.. ఘెర పరాజయం పాలైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని ప్రయతి్నస్తోంది. ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న చరిష్మాతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతోంది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావును బరిలో దింపింది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈ పార్టీ తరపున పోటీ చేసిన నందీశ్వర్గౌడ్ వంటి నాయకులు ఈ ఎన్నికల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు పార్టీని వీడారు. సత్తా చాటేందుకు హస్తం యత్నం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో సత్తా చాటేందుకు సై అంటోంది. వరుస చేరికలతో ఊపు మీదున్న హస్తం పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి తదితర నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలంమధు ముదిరాజ్ను ఎంపిక చేసింది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేస్తుండగా., కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయతి్నస్తోంది.ప్రభావితం చేసే అంశాలు ► మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాల భూనిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహార పంపిణీ, పునరావాస కల్పన అంశాలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐదు వేల వరకు నిర్వాసిత కుటుంబాలున్నాయి. ► బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభు త్వరంగ సంస్థల్లో సుమారు 20 వేలమంది ఉద్యోగులున్నారు. వారితోపా టు కుటుంబసభ్యుల ఓట్లూ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి. ► యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కారి్మకులు పటాన్చెరు, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు. చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ► మెదక్ ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. -
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్రావుకు సవాల్ విసిరారు. హరీశ్కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు.
Related News by category
-
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్నగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు. -
సూపర్-6.. సూపర్-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మానశ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్సవిశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. -
YSRCP Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారాయన. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం. కానీ, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం. 2014లోనూ నాకు బాగా గుర్తుంది. ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పాం. అమలు చేసినా, చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది నా మంచి కోసమంటూ చెప్పారు. కానీ, నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా. ఇదీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలి. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్షిప్ అంటే చెప్పిన ప్రతీ మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే. నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం. చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అందించాం. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడమూ ఎప్పుడూ జరగలేదు. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసింది. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. సాధ్యంకాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు?. రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలి. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోంది. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం. చట్టం అమలు చేసి 50 శాతం రిజర్వేషన్లతో నామినేటెడ్ పదవులు ఇచ్చాం. YSRCP మేనిఫెస్టో కాపీ కోసం క్లిక్ చేయండిబీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులిచ్చాం. 60 శాతం మంత్రి పదవులు పేద విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించాం. పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ లేకుండా చేశాం. మేం ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశాం. ఎక్కడా లంచాల ప్రస్తావన లేకుండా డీబీటీ ద్వారా సంక్షేమం అందించాం. 2014-19 మధ్య 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గత 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదు. జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదు. చంద్రబాబు చెబుతున్న పథకాలను లక్షా 21 వేల కోట్ల రూపాయలు అవసరం. మనం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి 29 వేల 100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అంటే.. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాల కలిపి అమలు అమలు చేయాలంటే కచ్చితంగా అక్షరాల లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం?.. మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టిని పరిశీలిస్తే.. ప్రతీ ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించింది. మరి ఎక్కడ సృష్టించారు? తాను సంపద సృష్టించానని చంద్రబాబు సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు? అని సీఎం జగన్ నిలదీశారు. సమర్థవంతమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. 2014-19 చంద్రబాబు పాలనలో అప్పులు భారీగా పెరిగాయి. చంద్రబాబు హయాంలో అప్పులు 21.8 శాతం పెరిగాయి. మా పాలనలో అప్పులు కేవలం 12.13 శాతానికి పరిమితమైంది. రెండేళ్లలో కోవిడ్ పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు హయాంలో 4.47 శాతం జీఎస్ డీపీ ఉంటే మన హయాంలో 4.83 శాతం జీఎస్ డీపీ ఉందిట్యాక్స్లు వేసి బాదేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అది కూడా చూద్దాం. చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57 శాతం అయితే జగన్ హయాంలో 6.35 శాతం. అన్నింటికీ లెక్కలు ఉన్నాయి. జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడడు. జగన్ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించి, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా.. పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వేయలేరు. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ పేదవాళ్ల కోసం అడుగులు వేస్తాడు. పేదవాళ్లు మంచి చేసే విషయంలో జగన్కు ఉన్న ప్రేమ మరెవరికీ ఉండదు.. ఉండబోదు. జగన్కు మనసు ఉంది. కల్మషం లేదు. పెన్షన్ల విషయంలో అవ్వాతాతల మీద చూపించిన ప్రేమ చరిత్రలో ఎవరూ చూపించలేదు.YSRCP మేనిఫెస్టో విడుదల.. ముఖ్యమైన అంశాలు.. రెండు పేజీలతో కూడిన YSRCP మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టో చదివి వినిపించారాయన.రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు(2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం)66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదు.అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపుఅమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాంరాబోయే ఐదేళ్లలో వైద్యంపై స్పెషల్ ఫోకస్. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ(ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగింపు.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపునాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపువైస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపుమత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేతవైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణంఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలువాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాంలారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమాచేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలువైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపులా నేస్తం కొనసాగింపుఅర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపునాడు-నేడు..ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్.. జిల్లాకో స్కిల్డెవలప్మెంట్ కాలేజీ.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీస్విగ్గీ, జొమాటో లాంటి గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా వర్తింపుఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్వీటితో పాటు.. వివిధ వర్గాలకు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ప్రస్తావనరాజధానుల విషయంలోమళ్లీ అధికారంలోకి రాగానే.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాంరాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖను తీర్చి దిద్దుతాంఅమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తాంకర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాంభోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును పూర్తి చేస్తాంమొత్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంది.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement