20న పలమనేరులో వైఎస్‌ జగన్‌ పర్యటన | Sakshi
Sakshi News home page

20న పలమనేరులో వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Mon, Mar 18 2019 1:22 PM

ys Jagan Election Campaign in Palamaner - Sakshi

పలమనేరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20న పలమనేరు పట్టణానికి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం ఆదివారం తెలిపారు. ఇందుకోసం పట్టణ సమీపంలోని గంటావూరు వద్ద హెలిప్యాడ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పలమనేరు అభ్యర్థి వెంకటేగౌడ, పట్టణ కన్వీనర్‌ మండీసుధ పనులు పర్యవేక్షిస్తున్నారు. 20వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని జాతీయ రహదారి మీదుగా పట్టణంలోకి చేరుకుని స్థానిక ఏటీఎం సర్కిల్‌ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్టు  తలశిల రఘురాం తెలిపారు.  

Advertisement
Advertisement