సాలూరులో.. సంక్షేమ సంతకం
దట్టమైన అటవీ ప్రాంతాల గుండా అద్దంలా మెరిసే తారురోడ్లు.. ప్రతీ గూడకు చేరువైన సంక్షేమ, అభివృద్ధి పాలన, ఇంటింటా ‘నవరత్న’వికాసం.. తీరిన సిగ్నల్స్ సమస్యలు.. అందుబాటులోకి వచ్చిన విద్య, వైద్య సదుపాయాలు.. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు చేరువైన కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ విద్య, సచివాలయ వ్యవస్థతో ఊరిలోనే అందుతున్న ప్రభుత్వ సేవలు.. తీరిన వంతెన వెతలు.. ఇలా ప్రతి ఊరు/వార్డులో కేవలం 58 నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పాలన సాక్షాత్కరిస్తోంది. ఇంటింటా సంక్షేమ సంతకం కనిపిస్తోంది. ● గిరిశిఖర గ్రామాలకు ‘మార్గం’ సుగమం ● ఇంటింటా ‘నవరత్న’ వికాసం ● వివిధ సంక్షేమ పథకాల కింద 8,14,539 మందికి రూ.1,628 కోట్ల ఆర్థిక ప్రయోజనం ● రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు సాలూరు:
మంచి ఆలోచన కలిగిన నాయకుడు పాలకుడైతే ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందనేందుకు సాలూరు నియోజకవర్గమే నిలువెత్తు సాక్ష్యం. గిరిజనుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కావడం, ఈ ప్రాంతంలోని సమస్యలు, చేకూర్చాల్సిన సదుపాయాలు, ప్రతి ఊరు, వార్డుపైన స్పష్టమైన అవగాహన, చక్కని విజన్ ఉన్న నాయకుడు పాలన సాగించడంతో కేవలం 58 నెలల్లోనే నియోజకవర్గం ప్రగతి పట్టాలెక్కింది. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఏ రోజు సాలూరు నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. ఇక్కడి గిరిజన సమస్యలపై కనీసం స్పందించలేదు. సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీల కాళ్లుపట్టుకోవాల్సిన దుస్థితి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన గూడల్లో విద్యా చైతన్యం వెల్లివిరుస్తోంది. ప్రతీ గ్రామానికి రోడ్డు సదుపాయాలు కలిగాయి. వైద్యసేవలు అక్కరకు వచ్చాయి. సొంతింటి భాగ్యం సమకూరింది. రిజర్వాయర్ల ఆధునికీకరణతో సాగునీటి వెతలు తీరాయి. చినుకుపడితే ఉగ్రరూపం దాల్చే వాగులపై వంతెన నిర్మాణాలు పూర్తయ్యాయి. పట్టణ ప్రజలకు ట్రాఫికష్టాలు తీర్చేలా బైపాస్రోడ్డు నిర్మితమైంది. గిరిజన వర్సిటీ గిరిజనుల చెంతకే వచ్చింది. రైతులకు డా.వైఎస్సార్ అగ్రిల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు నిధులతో ప్రభుత్వ బడులకు ఆధునిక సొబగులు అద్దుకున్నాయి. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుతో ప్రతి ఊరూ కొత్తరూపును సంతరించుకుంది. సాలూరులో సంక్షేమ వికాసం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రతి ఇంటా ఆర్థిక వికాసం..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో సాలూ రు నియోజకవర్గంలో సుమారు 8,14,539 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద 1,628 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. రూ.1300 కోట్ల వ్యయంతో ప్రభుత్వ భవనాలు, వంతెనలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు తదితర 15,857 అభివృద్ధి పను లు చేపట్టారు. వీటిలో ఇప్పటికే సుమారు 7వేల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రజలకు ఆరోగ్య భరోసా..
ప్రజల ఆరోగ్యానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ధనవంతులకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ సేవలను పేద ప్రజలకు చేరువచేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియ మించింది. ఊరూరా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసింది. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వీలుగా సాలూరు ఏరియా ఆస్పత్రిని వంద పడకలకు స్థాయి పెంచింది. రూ.17కోట్ల నాబార్డు నిధులతో ఆస్పత్రికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతోంది. గత టీడీపీ ప్రభుత్వం ఆస్పత్రికి టెంకాయ కొట్టి పనులను విస్మరించిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు.
వంతెన నిర్మాణాలు ఇలా..
గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ, పీఆర్ ప్రాజెక్టు, ఆర్అండ్బీ తదితర శాఖల ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వంతెన నిర్మాణాలు చేపట్టింది.
●సాలూరు మండలంలో కందులపదం వద్ద గో ముఖి నదిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 5.13 కోట్ల ఖర్చుతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో వంతె న నిర్మాణాన్ని పూర్తిచేసింది. దీంతో సుమారు 50 గ్రామాల ప్రజలకు రాకపోకల కష్టాలు తొలగాయి.
●పాచిపెంట మండలంలో మోసూరు వంతెనను రూ.8 కోట్లతో పూర్తిచేసింది.
●సుమారు కోటి రుపాయలతో పాచిపెంట మండలం పద్మాపురం నుంచి ఈతమానువలస మధ్యలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది.
●సుమారు కోటి ఖర్చుతో తలపెట్టిన కొండమోసూరు–దొరలుద్దండి మధ్య బ్రిడ్జి పనులు చివరిదశలో ఉన్నాయి.
●సాలూరు మండలం తుండ ఆర్అండ్బీ రోడ్డు నుంచి మక్కువ వెళ్లే రోడ్డులో బట్టివలస వద్ద సు మారు రూ.కోటి ఖర్చుతో వంతెన నిర్మాణం తలపెట్టింది. ●నంద–తుండ ఆర్అండ్బీ రోడ్డు నుంచి సీబిలి మధ్యలో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి శ్లాబ్ లెవెల్లో ఉంది.
●సొంపిగాం, కురుకూటి, ఆలూరు–మోదుగ మ ధ్య, గుంటబద్ర ,లింగాడవలస బ్రిడ్జిలు, నేరెళ్లవల స, వెలగవలస –ములక్కాయవలస బ్రిడ్జి పనుల కు అధికారులు చర్యలు చేపట్టారు.
సొంతింటి కల సాకారం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టణం, మండలాల్లోని వేలాదిమంది పేదలకు సొంతింటి కలను సాకారం చేసింది. ఉచితంగా స్థలాలు ఇవ్వడంతో పాటు నిర్మాణానికి రూ.1.80లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తోంది. సాలూరు పట్టణంలో రూ.82.85 కోట్లతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఒక్క రూపాయికే 1056 మంది లబ్ధిదారులకు అప్పగించింది. కోట్లా ది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించింది.
ప్రాజెక్టుల ఆధునికీకరణ
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2006లో పాచిపెంట మండల కేంద్రంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించారు. వెంగళరాయసాగర్, ఆండ్ర రిజర్వాయర్లు కూడా సాలూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. వీటిని కోట్లాది రూపాయలతో ఆధునీకరించి రైతుల సాగునీటి కష్టాలు తీర్చడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సఫలమైంది. మరోవైపు గిరిజన రైతులు సాగుచేసే భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేసింది. రాళ్ల దారుల్లో రాచబాటలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిసారిగా గిరిశిఖ ర గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణాలు ఈ ఐదేళ్లలోనే సాగాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అటవీశాఖ అనుమతులు తెచ్చి రాళ్లదారులను రాచబాటలుగా మార్చింది. గిరిజన ప్రజలకు రాకపోకల కష్టాలు తొ లగించింది. – ఎన్హెచ్–26 నుంచి కరడావలసకు రూ.4.96కోట్లతో 7.30 కి.మీ రోడ్డు నిర్మించింది. సాలూరు మండలం గంజాయిభద్ర పంచాయతీ దిగువశెంబి నుంచి డిప్పలపాడు మీదుగా తోణాంకు రూ.6.20 కోట్లతో 6 కి.మీ. మేర రోడ్డుపనులకు నిధు లు మంజూరయ్యాయి.
పాచిపెంట మండలంలోని ఆజూరు నుంచి పందిరిమామిడివలసకు సుమారు రూ.2.24కోట్లతో 3.80 కి.మీ.రోడ్డు నిర్మాణం పూర్తయింది.
పాచిపెంట మండలంలోని కుంతాం బీటీ రోడ్డు నుంచి తుమ్మిగుడ్డకు రూ.4.65కోట్లతో 6.90 కి.మీ రోడ్డును ప్రభుత్వం నిర్మించింది.
పాచిపెంట మండలం నీలంవలస నుంచి గుమ్మిడిగూడకు రూ.3.76కోట్లతో 6.80 కి.మీ రోడ్డు నిర్మాణాన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది.
వేటగాని వలస నుంచి శతాబి మీదుగా అరకుకు రూ.9.97కోట్లతో తలపెట్టిన 14 కి.మీ రోడ్డులో 8 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసింది.
రూ.6.28 కోట్లతో వేటగానివలస నుంచి తంగ్లాంకు రోడ్డు పనులు జరుగుతున్నాయి.
రొడ్డవలస నుంచి కంకణాపల్లికు రూ.1.35కోట్లతో 1.20 కి.మీ రోడ్డు నిర్మాణ దశలో ఉంది.
రూ.4.03కోట్ల అంచనా వ్యయంతో పాచిపెంట మండలం ఆలూరు నుంచి మోదుగ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సాలూరు మండలం నంద–పగులుచెన్నేరు నుంచి కొదమకు సుమారు రూ.11.32కోట్లతో 10.80 కి.మీ రోడ్డు పనులు చివరిదశకు చేరాయి.