ముందు ఫ్యాన్.. వెనుక స్క్రీన్.. వైఎస్ జగన్ అభిమాని
Published
Sat, Apr 6 2019 12:17 PM
రాయవరం (మండపేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నాడు ఓ యువకుడు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వి.సావరం గ్రామానికి చెందిన గుత్తుల లాల్కిశోర్ తన మోటార్ సైకిల్ ముందుభాగంలో తిరిగే ఫ్యాన్ గుర్తును ఏర్పాటు చేసి, వెనుక భాగాన ఎల్ఈడీ స్క్రీన్తోపాటు మైక్ను ఏర్పాటు చేసుకున్నాడు.
పగలంగా మైక్లో ప్రచారం చేస్తూ..రాత్రి సమయంలో ఎల్ఈడీ స్క్రీన్తో ప్రచారం చేస్తున్నాడు. ప్రధాన సెంటర్లలో మోటార్ సైకిల్ను ఆపి తన అభిమాన నేత జగన్మోహన్రెడ్డి, అలాగే అమలాపురం ఎంపీ అభ్యర్థి చింతా అనూరాధ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రసంగాలను స్క్రీన్పై ప్రదర్శిస్తున్నాడు. ఈ మొబైల్ ప్రచారాన్ని చూస్తున్నవారంతా కిశోర్ను అభినందిస్తున్నారు.