144వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | Sakshi
Sakshi News home page

144వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Tue, Apr 24 2018 9:28 AM

YS Jagan Prajasanklpayatra 144 Day Starts - Sakshi

సాక్షి, గన్నవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ 144వ రోజు ప్రజాసంకల్పయాత్రను మంగళవారం ఉదయం గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించనున్నారు. ఇప్పటివరకూ ఆయన 1,854.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Advertisement
Advertisement