సేవ చేసే అవకాశాన్ని జగనన్నకు ఇవ్వండి : వైఎస్‌ షర్మిల | Sakshi
Sakshi News home page

మీకు సేవ చేసే అవకాశాన్ని జగనన్నకు ఇవ్వండి : వైఎస్‌ షర్మిల

Published Tue, Apr 2 2019 1:02 PM

YS Sharmila Speech In Veerankilaku Public Meeting - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా : ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదా కోసం జగనన్న ఎన్నో పోరాటాలు చేశారు. కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికై  పాదయాత్ర చేశారు. ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా మీకు సేవా చేయలని ఆశపడుతున్నారు. మీకు సేవచేసే అవకాశాన్ని రాజన్న బిడ్డ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవ్వమని అడుగుతున్నాను. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి. రైతే రాజు కావాలంటే జగనన్న సీఎం కావాలి. గొప్ప మెజారిటీతో వైఎస్‌ జగన్‌ను గెలిపించండి’ అని  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల మంగళవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

ఇలాంటి సీఎం అవసరమా?
పామర్రు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోస పోతారా? ఈ సారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఇలాంటి సీఎం అవసరమా? ఆరోగ్యశ్రీని తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?  15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ ఇయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. నమ్ముతారా? 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది?  కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? 

చంద్రబాబును ఇవి అడగండి
గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి.

రోషం అంటే అది..
చంద్రబాబు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషం అట ,రోషం అట. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌ను నుంచి సింగిల్‌గా బయటకు వచ్చారు వైఎస్‌ జగన్‌. అదీ రోషం అంటే. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్‌ గానే వస్తుంది. గుంపుగా వస్తుంది చంద్రబాబు. ఈయన పొత్తులు లేని ఎన్నికలు చేయలేదు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు.. రోజుకో మాట పూటకో వేషం వేస్తున్న బాబును చూసి ఊసరవెల్లి కూడా పారిపోతుంది. హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకొని పొత్తుకోసం ప్రయత్నించారు. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు అయితే ఇప్పుడు మాతో పొత్తు అంటున్నాడు.

పదవులు లేకున్నా జగన్‌ మోహన్‌ రెడ్డి తొమ్మిదేళ్ల పాటు విలువలతో కూడిన రాజకీయం చేశారు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికై  పాదయాత్ర చేశారు. ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా మీకు సేవా చేయలని ఆశపడుతున్నారు. మీకు సేవచేసే అవకాశాన్ని రాజన్న బిడ్డ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవ్వమని అడుగుతున్నాను. వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పామర్రు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌  అన్నను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement