నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

Published Thu, Nov 1 2018 5:19 AM

YSRCP leaders to meet Governor today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్‌సీపీ నేతలు కలవనున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై ఈ నెల 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వ అనుమానాస్పద తీరుపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు వారు ఓ వినతిపత్రాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే.. థర్డ్‌ పార్టీ విచారణ చేయాల్సిన ఆవశ్యకతను గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వివరిస్తారని సమాచారం.  

Advertisement
Advertisement