సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర 93వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం విప్పగుంట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చౌటపాలెం, లింగంగుంట, మలెపాడు మీదగా తిమ్మపాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.
విప్పగుంటలో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 92వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట వద్ద ముగిసింది. ఇవాళ ఆయన 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. వెంకటాద్రిపాలం, అనంతసాగరం క్రాస్, ఎడ్లురుపాడు, పెదవెంకన్నపాలెం మీదగా విప్పగుంట వరకూ పాదయాత్ర కొనసాగింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ 1248.9 కిలోమీటర్లు నడిచారు. ఇక ప్రజాసంకల్పయాత్రలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను రాజన్న తనయుడికి విన్నవించుకుంటున్నారు.