నెల్లూరు(సెంట్రల్): ‘సార్.. ఉన్నత చదువులు చదివిన మేము ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ రెసెడెన్షియల్గా విధులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగులకు దీటుగా రోగులకు వైద్యం సేవలందిస్తున్నాం. ఇంత చేస్తున్న మాకు గత ఏడు నెలల నుంచి జీతభత్యాలు అందించడం లేదు’ అని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్లురెడ్డి జననేతకు విన్నవించాడు. జీతాలు అందక కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీలిచ్చినా ఫలితం లేదని వాపోయాడు.
Breadcrumb
Related news
-
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
విజయ సంకల్పానికి ఐదేళ్లు
విజయ సంకల్పానికి ఐదేళ్లు -
ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు
పసుపు రంగు కంచుకోటను వైఎస్ జగన్ అనే ఒకే ఒక్కడు పునాదులతో సహా పెకలించిన జ్ఞాపకాలకు ఆ స్థూపం సజీవ సాక్ష్యం. రాజకీయ ఉద్ధండుల అంచనాలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ కుమారుడు రాసిన నవ చరితకు ఆ కట్టడమే తొలి అక్షరం. విలువలు వదిలేసిన నాటి పాలకులు కలలో కూడా భయపడేలా ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన యుద్ధానికి ఆ నిర్మాణం ఓ నిదర్శనం. తన పద ఘట్టనలతో పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన యాగానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఆయన జనం మనసులు గెలుచుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్: రాజన్న బిడ్డగా, ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయ్యాయి. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర ఆయన సాగించిన పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ 2017, 2018, 2019 సంవత్సరాల్లో పాదయాత్రను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ఎత్తుకున్న పనిని సమర్థంగా నిర్వర్తించారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 13 జిల్లాలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా 3,648 కిలో మీటర్ల మేర సాగిన ప్రజా సంకల్పయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్ సభ స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా మారిపోయారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేశారు. పాదయాత్రకు గుర్తుగా లొద్దపుట్టిలో నిర్మించిన విజయ స్థూపం ఆ నాటి కథలను అందరికీ గుర్తు చేస్తోంది. సమర్థ పాలకుడిగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవస్థల దెబ్బకు దళారీలు మాయమయ్యారు. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూ డం...పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే నేటి ప్రభుత్వం అజెండా. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. సాంఘిక భద్రతలో భాగంగా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్నించే క్రమంలో పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సాయం అందిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో పేదలకు భరోసా ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్ప ను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థను ప్రకటించి సంచలన సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. చరిత్ర నిలిచి పోయేలా ప్రజా రంజక పాలన సాగిస్తున్న జగనన్న మరో 30 ఏళ్లు సీఎంగా ఉండటం గ్యారెంటీ. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, శ్రీకాకుళం సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సీఎం జగనన్న నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఆయనతో కలసి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికలకు విజయాలు. – పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం సమన్వయకర్త సంక్షేమానికి పెద్దపీట వెనుకబడిన ఉత్తరాంధ్ర తలరాతను మార్చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వలస ప్రాంతంగా పిలిచే నోటితో ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువచ్చారు. కిడ్నీ ఆస్పత్రితో పాటు ఇంటింటికి తాగునీరు, పోర్టులు నిర్మాణాలు చేపట్టి దేవుడయ్యారు. ప్రతి కుటుంబానికి మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విజయ స్థూపం సాక్షిగా మళ్లీ ఆంధ్ర ప్రదేశ్కు ముఖ్యమంత్రి జగనన్నే. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ, శ్రీకాకుళం -
ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్లు .. తిరుపతిలోని తుడా సర్కిల్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం (ఫోటోలు)
-
ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి
►ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకలూరులో సంబరాలు ►వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి,కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు ►కృష్ణాజిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పెడన వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ ►పాల్గొన్న పెడన పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ బండారు మల్లి, పార్టీ నాయకులు ►పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ►అనంతరం పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ►తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ►హాజరైన పలు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ►నెల్లూరు: జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆఫీస్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాని ►అనంతరం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి ►కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి. ►ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. ‘ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం నెరవేర్చాం. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పని చెయ్యాలి. ►తిరుపతి: తుడా వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ►సీఎం జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెంకటేష్, మునిరామిరెడ్డి,పొన్నాల చంద్ర, నరసింహచారి పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి 2018 డిసెంబర్ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాలమీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది జననేతతో కలసి అడుగులు వేశారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను, అనుభవాలను మేనిఫెస్టోగా రూపొందించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో 90శాతం, నాలుగున్నరేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రకు ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలులో పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేయనున్నట్లు జిల్లా కమిటీ పేర్కొంది.
Related News by category
-
స్థానికుడిని.. మీకేం కావాలో నాకు తెలుసు
పొదలకూరు: ‘నేను స్థానికుడిని. మండలంలో ప్రతి గ్రామం గురించి తెలుసు. మీకేం కావాలో ఐడియా ఉంది. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అలియాస్ అల్లీపురంరెడ్డి అవకాశం కోసం వస్తున్నాడు. ఆయన్ను నమ్మొద్దు. ఎన్నికలయ్యాక కనిపించడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆల్తుర్తి, ఆర్వైపాళెం, అంకుపల్లి, వెంకటాపురం, పర్వతాపురం, పులికల్లు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ వారిని మోసం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి వీధిలో సిమెంటురోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించామన్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి వస్తున్నాడని, ఆయన్ను నమ్మొద్దని సూచించారు. ఓటెందుకు వేయాలి సోమిరెడ్డి.. ఏం మేలు చేశావని ప్రజలు నీకు ఓటేయాలని సోమిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నారు. రూ.కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేశానని, మురుగునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు కాకాణి చెప్పారు. పేదలకు భూముల పంపిణీ, చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. మూడో పర్యాయం అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయో గుర్తించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట చిల్లకూరు వెంకురెడ్డి, పి.బాబిరెడ్డి, బూసుపల్లి చిన్నపరెడ్డి, కె.రామిరెడ్డి, శ్రీహరి, చంద్రశేఖర్, వై.పెంచలరెడ్డి, టి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
ఆత్మకూరును అభివృద్ధి చేస్తాం
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మర్రిపాడు: ‘ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలి’ అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. మండలంలోని చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పలువురికి ప్యాకేజీలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేశారన్నారు. దీని వల్ల వైఎస్సార్సీపీకి మేలు చేకూరిందన్నారు. అనేకమంది విక్రమ్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏఎస్పేటలో జరిగిన కార్యక్రమంలో ఆనం చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేస్తున్నామన్నారు. వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాతే ఆత్మకూరులో రామనారాయణరెడ్డి తిరుగుతున్నారని చెప్పారు. వెంకటగిరికి వెళ్లిపోయాడని, వేమిరెడ్డి అందజేసిన ప్యాకేజీతో ఆనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఆయనకు త్వరలోనే సరైన సమాధానం చెబుతామన్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మరని, వైఎస్సార్సీపీని ప్రజలంతా మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు, దశరథరామిరెడ్డి, గువ్వల వెంగళరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మౌలాలి, హజరత్రెడ్డి, దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్రెడ్డి, రేవూ రు వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మరంగా తనిఖీలు నెల్లూకరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణా కట్టడికి పోలీసు, సెబ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళ, బుధవారాల్లో మనుబోలు పోలీసుస్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంకటాచలసత్రం పరిధిలో 19, ఇందుకూరుపేటలో 10, సైదాపురంలో ఆరు మద్యం బాటిళ్లు, సెబ్ అధికారులు 195 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కండలేరులో 7.636 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 7.636 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. హెడ్రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 250 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్ కాలువకు 25 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మీ కోసం.. మా వంతుగా..
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు నిహారిక బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ఏడో వార్డులో కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తరఫున ఆయన సతీమణి నల్లపరెడ్డి గీతారెడ్డి, కోడలు పూజారెడ్డి ప్రచారం చేశారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు రామిరెడ్డి బాలసాకేత్రెడ్డి – మహిమ దంపతులు, కుమార్తె సంహిత – అఖిలేష్రెడ్డి దంపతులు 35వ వార్డులో కరపత్రాలు పంపిణీ చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాణి గోవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కుమార్తె పూజిత ముత్తుకూరు పట్టణం బీసీ కాలనీ, ఎమ్మార్వో గిరిజన కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని కోరారు. – ఉదయగిరి/బుచ్చిరెడ్డిపాళెం రూరల్/కావలి/ముత్తుకూరు -
No Headline
నామినేషన్లు వేయాల్సిన కార్యాలయాలు నియోజకవర్గం నెల్లూరు లోక్సభ కలెక్టర్ చాంబర్ నెల్లూరు సిటీ కార్పొరేషన్ నెల్లూరు రూరల్ ఆర్డీఓ కందుకూరు సబ్ కలెక్టర్ కావలి ఆర్డీఓ ఆత్మకూరు మున్సిపల్ కోవూరు తహసీల్దార్ సర్వేపల్లి ఎంపీడీఓ ఉదయగిరి తహసీల్దార్ -
టీడీపీకి ఓట్లేస్తే చీకటి రోజులు తప్పవు
● కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే చీకటి రోజులు తప్పవు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ స్థాపించిన నాటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారన్నారు. 2019లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఆయన రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కర్నూలు వంటి కీలక స్థానాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. అదే విధంగా కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. చంద్రబాబు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్, మొగల్ సలీం బేగ్, మొగల్ రహీం బేగ్, పఠాన్ నవాజ్ ఖాన్, షేక్ ఫీర్ మహమ్మద్, నాయబ్ రసూల్, షేక్ అబ్దుల్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement