సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారో లేదో పరుగెత్తి పరీక్షించుకోవాలని, అందుకోసం జన్మభూమిలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 5కే రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో అందరూ పాల్గొని పరుగెత్తాలని సూచించారు. 5 కిలోమీటర్లు సునాయాసంగా పరుగెత్తితే ఆరోగ్య సమస్యలు లేనట్లని, పరుగు తీయకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు భావించాలని తెలిపారు. దీనిలో జర్నలిస్టులు ఏమీ మినహాయింపు కాదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన మూడున్నరేళ్లలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని శ్మశానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు.
దుర్గ గుడి ఈవోపై బదిలీ వేటు
విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) సూర్యకుమారిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను నియమిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 26వ తేదీన గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఆ శాఖ కమిషనర్ అనూరాధ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ గుర్తించిన అంశాలతో ముఖ్యమంత్రికి నివేదికను అందజేశారు. దుర్గ గుడిలో తాంత్రిక పూçజల వ్యవహారంపై చర్చించారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ఈవోను తప్పించి, తాంత్రిక పూజల ఆరోపణలపై విచారణ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. పరిపాలన పరమైన లోపాల కారణంగానే ఈవో తప్పించామని. తాంత్రిక పూజలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా 5కే రన్
Published Sun, Jan 7 2018 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement