వైజాగ్‌ బిల్డింగ్‌లో వింత ఆకారాల కలకలం | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ బిల్డింగ్‌లో వింత ఆకారాల కలకలం

Published Sat, Nov 18 2017 11:48 AM

Birds Like Objects Found in Vizag Construction, Goes Viral - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

విశాఖపట్టణం : నగరంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో పక్షులు వింత ఆకారంలో ఉన్నాయంటూ కలకలం రేగింది. చూడటానికి పక్షుల రూపంలో ఉన్న మూడు జీవులు అచ్చం మనుషుల్లా నిల్చొని ఉండటాన్ని నిర్మాణంలో పని చేస్తున్న కొందరు గుర్తించారు. వెంటనే తమ మొబైళ్లకు పని చెప్పి.. వాటిని వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మనుషులు కెమెరాల లైటింగ్‌తో వీడియో తీస్తున్నా అవి తొణక్కుండా నిలబడటం ఆశ్చర్యపరుస్తోంది.

కాగా, ఆ పక్షులు బార్న్‌జాతికి చెందిన గుడ్లగూబ పిల్లలుగా తెలిసింది. ఇవి హిమాలయాలు, పసిఫిక్‌ మహా సముద్ర ద్వీపాలు, ఇండోనేసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవయసులో రెక్కలు రాకుండా ఉన్న వాటిని తల్లి పక్షి బిల్డింగ్‌లో ఉంచింది. అయితే, మూడు పక్షుల్లో రెండు మాత్రమే పూర్తిగా కనిపించగా.. మరొకటి ఆ రెండింటి వెనుక దాగి ఉంది. మరి బార్న్‌ గుడ్లగూబలు ఎలా ఉన్నాయో మీరూ ఈ క్రింది వీడియోలో చూసేయండి.

వైజాగ్‌లో వింత ఆకారాలు కలకలం 

Advertisement
Advertisement