Sakshi News home page

అప్పుడు లక్ష్మణ్.. ఇప్పుడు రోహిత్

Published Sat, Dec 5 2015 1:07 PM

అప్పుడు లక్ష్మణ్.. ఇప్పుడు రోహిత్

ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా శనివారం మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి రోహిత్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.  దీంతో పాటు తొలి బంతికే వెనుదిరిగి  'గోల్డెన్ డక్' గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

 

16 సంవత్సరాల క్రితం టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఇదే తరహాలో అవుట్ కావడం గమనార్హం. 1999 లో గవాస్కర్-బోర్డర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ తొలి బంతికే డకౌటయ్యాడు. అప్పుడు లక్ష్మణ్ మూడో స్థానంలో వచ్చి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగగా..  ఆ తరువాత ఇంత కాలానికి  టీమిండియా తరపున రోహిత్ అదే స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మొదటి బంతికే అవుటయ్యాడు.

Advertisement
Advertisement