తొలిరోజు ఆట ముగిసేసరికి ఆసీస్ స్కోర్ : 259/5 | Sakshi
Sakshi News home page

తొలిరోజు ఆట ముగిసేసరికి ఆసీస్ స్కోర్ : 259/5

Published Fri, Dec 26 2014 12:26 PM

తొలిరోజు ఆట ముగిసేసరికి ఆసీస్ స్కోర్ : 259/5

మెల్బోర్న్ :  భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు ఆదిలో తడబడినా ఆ తర్వాత నిలదొక్కుకుంది.  తొలుత ఓపెనర్గా దిగిన వార్నర్ ఖాతా తెరవకుండానే యాదవ్ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దాంతో ఆసీస్ ఆదిలోనే తొలి వికెట్ను కోల్పోయింది. అనంతరం ఆసీస్  నిలదొక్కుకుని దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

ఆసీస్ ఓపెనర్  రోజర్స్ ఆదినుంచి నిలకడగా ఆడగా అతనికి వాట్సన్ సరిజోడిగా విజృంభించాడు. ఇద్దరూ అర్థ సెంచరీ చేయటంతో పాటు వెనువెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మార్ష్,  బర్న్స్ తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టాడు. ఇక కెప్టెన్ స్మిత్ నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేశాడు. కెప్టెన్ స్మిత్ 72, హాడిన్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇక ఆసీస్ ఆటగాళ్లు రోజర్ 57, వాట్సన్ 52, మార్ష్ 32, బర్న్స్ 13 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్, షమికీ చెరో రెండు వికెట్లు,  అశ్విన్ ఒక వికెట్ దక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement