కాన్సూర్: ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో తొలిరోజు టీం ఇండియా తడబడింది. టాప్ ఆర్డర్ రాణించినా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో నిర్ణీత 87.1 ఓవర్లలో 291 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. న్యూజిల్యాండ్తో గురువారం ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఎంతో ఆసక్తి రేపిన ఈ టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తొమ్మిది పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. భారత్ స్కోరు 42 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ గా కేఎల్ రాహుల్(32) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
విజయ్ 123 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన చటేశ్వర పూజారా 84 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు చేశారు. వీరిద్దరూ రాణించడంతో ఓ దశలో 46.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 147 పరుగులతో దృఢంగా కనించిన టీమిండియా.. విజయ్, పూజారా, కోహ్లి వెంటవెంటనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
పుజారా, కొహ్లీలు 13 పరుగుల తేడాతో పెవిలియన్ కు చేరడంతో భారీ ఎదురుదెబ్బతగిలింది. అనంతరం బరిలోకి దిగిన రహానే 18, ఆర్జీ శర్మ 35 పరుగులు చేసి వెనుదిరిగారు. స్పిన్నర్ అశ్విన్ 40 పరుగులతో రాణించి సాంట్నెర్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే డబ్ల్యూపీ సాహా, మహమ్మద్ షమి లు కూడా డక్ అవుట్ అయ్యారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఉమేశ్ యాదవ్ 8 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. న్యూజిల్యాండ్ బౌలర్లలో బౌల్ట్, సాంట్నెర్ తలో మూడు వికెట్లు పడగొట్టి రాణించారు.
తడబడిన టీమిండియా.. 9 వికెట్లు ఫట్!
Published Thu, Sep 22 2016 5:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement