మెల్బోర్న్: యాషెస్ సిరీస్లో వరుసగా ఐదు టెస్టులు నెగ్గి జోరు మీదున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్లోనూ శుభారంభం చేసింది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (128 బంతుల్లో 121; 12 ఫోర్లు) సెంచరీతో ఆసీస్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 269 పరుగులు చేసింది. బాలెన్సీ (96 బంతుల్లో 79; 6 ఫోర్లు), మోర్గాన్ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్సర్) మెరుగ్గా ఆడారు. ఓ దశలో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను మెర్గాన్, బాలెన్సీ నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో బట్లర్ (24 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్), బ్రెస్నన్ (9 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడారు. మెక్కే 3, కోల్టర్నీల్, మాక్స్వెల్, డోహెర్టీ, ఫాల్క్నర్ తలా ఓ వికెట్ తీశారు.
తర్వాత ఆస్ట్రేలియా 45.4 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి గెలిచింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాలెన్సీ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ఫించ్.. వార్నర్ (72 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి తొలి వికెట్కు 163 పరుగులు జోడించాడు. తర్వాత క్లార్క్ (42 బంతుల్లో 43; 6 ఫోర్లు) నిలకడగా ఆడుతూ ఫించ్తో కలిసి మూడో వికెట్కు 72 పరుగులు జోడించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. ఫించ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఫించ్ సెంచరీ: తొలి వన్డే ఆసీస్దే
Published Mon, Jan 13 2014 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement