టైటిల్ పోరుకు తమిళనాడు అర్హత
సెమీస్లో బరోడాపై విజయం
న్యూఢిల్లీ: తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్మెన్ రాణించడంతో... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన తమిళనాడు మరో విజయం సాధిస్తే అత్యధికంగా ఐదుసార్లు ఈ టైటిల్ నెగ్గిన జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో తమిళనాడు 2002–03; 2004–05; 2008–09, 2009–10 సీజన్లలో విజేతగా నిలిచింది. బరోడా జట్టుతో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో తమిళనాడు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా జట్టు 49.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.
ఒకదశలో రెండు వికెట్లకు 123 పరుగులతో పటిష్టంగా కనిపించిన బరోడా జట్టును తమిళనాడు బౌలర్ సాయికిశోర్ (4/59) దెబ్బతీయగా... అశ్విన్ క్రిస్ట్, వాషింగ్టన్ సుందర్, రాహిల్ షా రెండేసి వికెట్లు పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు జట్టు 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. దినేశ్ కార్తీక్ (77; 4 ఫోర్లు), విజయ్ శంకర్ (53 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి తమిళనాడు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 88 పరుగులు జోడించారు. దినేశ్ కార్తీక్ అవుటయ్యాక వాషింగ్టన్ సుందర్ (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)తో కలిసి విజయ్ శంకర్ తమిళనాడు విజయాన్ని ఖాయం చేశాడు. బరోడా బౌలర్లలో అతీత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగాల్తో జార్ఖండ్ తలపడుతుంది.
ఏడేళ్ల తర్వాత ఫైనల్కు...
Published Thu, Mar 16 2017 11:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement