హైదరాబాద్‌ రంజీ జట్టు ప్రకటన | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రంజీ జట్టు ప్రకటన

Published Tue, Oct 30 2018 10:12 AM

Akshath to lead Hyderabad Ranji team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల హైదరాబాద్‌ జట్టును సోమవారం ప్రకటించారు. నవంబర్‌ 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా పి. అక్షత్‌ రెడ్డి ఎంపికవగా... ఎన్‌. అర్జున్‌ యాదవ్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు ఆలిండియా కల్నల్‌ సీకే నాయుడు చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అండర్‌–23 హైదరాబాద్‌ జట్టును కూడా సోమవారమే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా చందన్‌ సహాని, కోచ్‌గా జాకీర్‌ హుస్సేన్‌ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్‌ 2 నుంచి 5 వరకు జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టుతో హైదరాబాద్‌ ఆడుతుంది.  

జట్ల వివరాలు

హైదరాబాద్‌ రంజీ జట్టు: పి. అక్షత్‌ రెడ్డి (కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, బి. సందీప్, కె. రోహిత్‌ రాయుడు, మొహమ్మద్‌ సిరాజ్, కె. సుమంత్, మెహదీ హసన్, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, సాకేత్‌ సాయిరాం, ఆకాశ్‌ భండారి, టి.రవితేజ, తనయ్‌ త్యాగరాజన్, హిమాలయ్‌ అగర్వాల్, కేఎస్‌కే చైతన్య, ఎన్‌. అర్జున్‌ యాదవ్‌ (కోచ్‌), ఎన్‌పీ సింగ్‌ (బౌలింగ్‌ కోచ్‌), దిలీప్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌).


∙హైదరాబాద్‌ అండర్‌–23 జట్టు: చందన్‌ సహాని (కెప్టెన్‌), భవేశ్‌ సేథ్‌ (వికెట్‌ కీపర్‌), గడ్డం సంకేత్, శశిధర్‌ రెడ్డి, శ్రేయస్‌ వాలా, యుధ్‌వీర్‌ సింగ్, ఆశిష్‌ శ్రీవాస్తవ్, భగత్‌ వర్మ, సాత్విక్‌ రెడ్డి, జైరాం రెడ్డి, అభిరత్‌ రెడ్డి, ఒమేర్, నిఖిల్, రాజమణి ప్రసాద్, నిఖిల్, జాకీర్‌ హుస్సేన్‌ (కోచ్‌), ఎం. శ్రీనివాస్‌ (అసిస్టెంట్‌కోచ్‌).


 

Advertisement
Advertisement