♦ నేడు భారత్, బంగ్లాదేశ్ ‘ఎ’ జట్ల మ్యాచ్
♦ యువ క్రికెటర్లకు చక్కని అవకాశం
బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ ‘ఎ’తో జరగనున్న తొలి వన్డేలో భారత్ ‘ఎ’ తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్తో ఫామ్లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఫలితంగా ప్రస్తుతం అందరి దృష్టి రైనాపైనే నెలకొంది. చివరిసారిగా బంగ్లాదేశ్ టూర్లో ఆడిన రైనా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్, అమిన్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్లాంటి నాణ్యమైన పేసర్లను ఎదుర్కొంటే ప్రొటీస్పై తిరుగుండదనే భావనతో ఈ యూపీ బ్యాట్స్మన్ ఉన్నాడు.
జాతీయ జట్టులో చోటును పదిలం చేసుకునేందుకు కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, ధవల్ కులకర్ణి, కర్ణ్ శర్మలు ఈ సిరీస్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్నారు. వచ్చే నెలలో సఫారీ జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్కు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు భారీ స్కోర్లతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ‘ఎ’తో సిరీస్లో రాణించిన ఉన్ముక్త్ చంద్, మయాంక్ అగర్వాల్ కూడా ఈ సిరీస్పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు బ్యాట్స్మెన్పై ఎక్కువగా దృష్టిపెట్టిన ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్... ఇప్పుడు బౌలింగ్ను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. పేసర్లు రుష్ కలారియా, శ్రీనాథ్ అరవింద్, కులకర్ణిలతో పాటు స్పిన్నర్లు కర్ణ్ శర్మ, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్లను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో వాళ్లకు ఆసీస్తో సిరీస్ ఉండటంతో దాదాపుగా సీనియర్లందరూ ఫిట్నెస్ కోసం ఈ సిరీస్ను ఉపయోగించుకోనున్నారు. దీంతో భారత కుర్రాళ్లు అప్రమత్తంగా లేకపోతే సిరీస్ చేజారే ప్రమాదం ఉంది.
రైనాపైనే అందరి దృష్టి
Published Wed, Sep 16 2015 1:36 AM
Advertisement
ఓటు ఎలా వేయాలో తెలుసా..?
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
మేతకొచ్చాడు.. మరో నేత!
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
చేతులు రఫ్గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
Advertisement