విశాఖపట్నం:ఐపీఎల్ -8లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజ్యింకా రహానే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 46 బంతులు ఎదుర్కొన్న రహానే ఏడు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ విజయం దిశగా సాగుతోంది.
16 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ మూడు వికెట్లు నష్టానికి 101 పరుగులను చేరింది. అంతకుముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్(13) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, కరుణ్ నాయర్(1)పరుగు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. క్రీజ్ లో రహానే కు జతగా స్టువర్ట్ బిన్నీ ఉన్నాడు.