న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డుకు ఇది గట్టి ఎదురుదెబ్బే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఏమాత్రం మింగుడుపడని విధంగా కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) వ్యవహరించారు. బోర్డు ప్రక్షాళన, పారదర్శకత కోసం జస్టిస్ ఆర్.ఎమ్.లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల్ని అమలు చేయాల్సిందేనని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఒక్కటి మినహా మిగతా సిఫార్సుల్ని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనన్నారు. ఆ ఒక్కటి ఏంటంటే సెలక్షన్ కమిటీ నియామక ప్రక్రియ. ఐదుగురు సభ్యుల ప్యానెల్ను ముగ్గురితో కుదించకుండా కొనసాగవచ్చని, కేవలం టెస్టులాడిన వారినే సెలక్టర్లు చేయాల్సిన పనిలేకుండా 20 ‘ఫస్ట్క్లాస్’ మ్యాచ్లాడినా ఫర్వాలేదన్నారు.
మిగతా ఐదు ప్రధాన సిఫార్సులైన... ఒక రాష్ట్రం–ఒక ఓటు, గరిష్టంగా పదవుల్లో కొనసాగే కాలం 18 ఏళ్లు (9+9), పదవుల మధ్య మూడేళ్ల విరామం, 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, ఎన్నికైన సభ్యులు (ఆఫీస్ బేరర్లు), సీఈఓ (ప్రొఫెషనల్స్)ల మధ్య అధికార పంపకాలులాంటివి అమలు చేయాలని సుబ్రమణియమ్ నివేదిక సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు జూలై 4న జరిగే విచారణలో తీర్పు ఇచ్చే అవకాశముంది.
# Tag
Related news
-
ఆర్సీబీని ఏకి పారేసిన టెన్నిస్ దిగ్గజం.. అమ్మిపారేయండంటూ అసహనం
ఆర్సీబీ యాజమాన్యంపై భారత టెన్నిస్ దిగ్గజం.. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ స్పెషలిస్ట్ (12 గ్రాండ్స్లామ్ టైటిల్స్ విన్నర్) మహేశ్ భూపతి తీవ్రస్థాయి ధ్వజమెత్తాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన నేపథ్యంలో భూపతి అసహనం వ్యక్తం చేశాడు. నిన్న (ఏప్రిల్ 15) ఆర్సీబీపై సన్రైజర్స్ రికార్డు స్కోర్ చేసిన అనంతరం భూపతి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇలా అన్నాడు. క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ అభిమానులు, ఆటగాళ్ళ కోసం బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీసీఐ చొరవ తీసుకుని ఆర్సీబీని స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి అప్పగించండి. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం అంటూ భూపతి తన ట్వీట్లో పేర్కొన్నాడు. For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic — Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024 స్వతహాగా ఆర్సీబీ అభిమాని అయిన భూపతి తన ఆరాధ్య ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీ పేలవ ప్రదర్శన చూసి విరక్తి చెంది ఈ ట్వీట్ చేశాడని తెలుస్తుంది. భూపతి విరాట్, డుప్లెసిస్లను బాగా అభిమానిస్తాడు. విరాట్పై అభిమానాన్ని భూపతి గతంలో చాలా సందర్భాల్లో బహిర్గతం చేశాడు. ఆర్సీబీ తాజా దుస్థితికి యాజమాన్య వైఖరి కారణమని భావిస్తున్న భూపతి కొత్త యాజమాన్యానికి ఫ్రాంచైజీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐని కోరాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్ల్లో ఆరింట ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన సన్రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
ఇకపై అలా చేస్తే భారీ జరిమానా: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్!
ఐపీఎల్-2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై మైదానంలో ఉన్నపుడు.. మ్యాచ్లకు సంబంధించిన ఫొటోలు, లైవ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఐపీఎల్ ఫ్రాంఛైజీలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జట్ల యజమానులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల సోషల్ మీడియా టీమ్లను ఉద్దేశించి ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు బోర్డుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు గానీ షేర్ చేయకూడదు. ఒక్కోసారి కొంతమంది కామెంటేటర్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినపుడు, మైదానం ఉన్నపుడు ఫొటోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో గనుక ఒక మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే అప్పుడు బ్రాడ్కాస్టర్లకు ఒక రకంగా అది నష్టమే. నిజానికి ఐపీఎల్ జట్లు సైతం లైవ్ మ్యాచ్ల వీడియోలు షేర్ చేయకూడదు. కొన్ని ఫొటోలు, లైవ్ మ్యాచ్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ ఫ్రాంఛైజీకి జరిమానా పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది ఆటగాళ్లు సైతం మ్యాచ్ డేకు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారని.. వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా తాము ఆదేశించినట్లు సదరు అధికారి వెల్లడించారు. కాగా ఐపీఎల్ 2023-2027 ప్రసార హక్కులను స్టార్ ఇండియా(టెలివిజన్- రూ. 23,575 కోట్లు), వయాకామ్ 18(డిజిటల్- రూ. 20,500 కోట్లు- జియో సినిమా) దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో మాత్రమే మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఐపీఎల్ టీమ్ గనుక లైవ్ గేమ్ను షేర్ చేస్తే రూ. 9 లక్షల మేర బోర్డు ఫైన్ విధించనున్నట్లు సమాచారం. -
స్వీట్ మెమోరీస్.. అద్భుతాలను నెమరువేసుకున్న ధోని
భారత క్రికెట్కు సంబంధించి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరిచయం అక్కర్లేని పేరు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ తన కెరీర్లో సాధించిన ఘనతల ద్వారా భారత్లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు. ధోని ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ధోనిని అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ధోనిని స్టయిల్ ఐకాన్గా ఆరాధించే వారు కోకొల్లలు. ధోని తాజా లుక్కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కెరీర్ ఆరంభంలో ధోని ఆహార్యం ఎలా ఉండిందో ప్రస్తుతం అలాగే ఉంది. జులపాల జట్టుతో ధోని సినిమా హీరోలను తలదన్నేలా ఉన్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు. ధోనికి వయసు మీద పడుతున్నా వన్నె తగ్గడం లేదని అభిమానులు అనుకుంటారు. DHONI AT BCCI HQ TO SEE THE WORLD CUP 2011 TROPHY 🇮🇳 - Video of the day. pic.twitter.com/fvWowwrUu7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్కు, సినిమాలకు మాత్రమే పరిమితమైన ధోని.. నిన్న (ఏప్రిల్ 14) ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఆడేందుకు ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐ హెడ్ క్వార్టర్స్కు సందర్శించిన ధోని.. భారత క్రికెట్ తరఫున తాను సాధించిన అద్భుతాలను నెమరువేసుకున్నాడు. బీసీసీఐ ఆఫీస్లో తాను సాధించిన ఘనతలను తలచుకుంటూ మురిసిపోయాడు. తన సారధ్యంలో టీమిండియా సాధించిన టీ20 వరల్డ్కప్ (2007), వన్డే వరల్డ్కప్ (2011) ట్రోఫీలను స్పర్శించి పరవశించిపోయాడు. టీమిండియా జెర్సీని చూసుకుని మురిసిపోయాడు. వన్డే వరల్డ్కప్లో తానాడిన విన్నింగ్ షాట్ ఫోటోగ్రాఫ్పై ఆటోగ్రాఫ్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోని బీసీసీఐ ఆఫీస్లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. నిన్నటి మ్యాచ్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ అనంతరం ఈ వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది. ముంబైతో మ్యాచ్లో చివరి ఓవర్లో బ్యాటింగ్కు దిగిన ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హార్దిక్ వేసిన ఆ ఓవర్లో అతను హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి పాత ధోనిని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్లో ధోని ఆడిన మెరుపు ఇన్నింగ్సే ముంబై, సీఎస్కే స్కోర్ల మధ్య వ్యత్యాసంగా నిలిచింది. ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కినప్పటికీ సీఎస్కే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కెరీర్ చరమాంకంలో (ఐపీఎల్) ఉన్న ధోని పాత రోజులను గుర్తు చేయడంతో అతని అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. ధోని ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. ఈ సీజన్లోనూ సీఎస్కేదే టైటిల్ అని చెప్పుకుంటున్నారు. ధోని ఇటీవలే సీఎస్కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోని స్వచ్ఛందంగా సీఎస్కే కెప్టెన్సీ నుంచి వైదొలిగి రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. ఈ సీజన్లో సీఎస్కే 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో విరాట్ కోహ్లి?
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా క్రికెట్ టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్తో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ను భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశముంది. ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్కప్ జట్టు నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని తప్పించనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు కోహ్లిని పక్కన పెట్టాలని మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. అయితే అవన్నీ రూమర్సే అని, టీ20 వరల్డ్కప్ జట్టు ఎంపికలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్బజ్ తమ తాజా రిపోర్ట్లో పేర్కొంది. కాగా కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరపున దుమ్ములేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే ఓ సెంచరీ సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆటగాడిని సెలక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయకుండా వదిలేయరని క్రిక్బజ్ తెలిపింది. -
IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
సన్రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా.. హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీకొంటుంది.
Related News by category
-
కోహ్లి స్ట్రైక్రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్లలో కలిపి 145.76 స్ట్రైక్రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్గా మాజీ ఆల్రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్తో కిర్స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్కప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్గా నియమించింది.కిర్స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్టైమ్ కోచ్గా సెటిల్ అయిన కిర్స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్గా పని చేశాడు. కిర్స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్గా పని చేశాడు. -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్తో కలిసి నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్కప్లో 14 ఏళ్ల తర్వాత భారత్కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement