ప్రశాంత్‌ శతకం | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ శతకం

Published Fri, Nov 10 2017 12:26 AM

 Andhra to the highest score - Sakshi

అగర్తలా: ఆంధ్ర టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కదంతొక్కడంతో త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర భారీస్కోరుపై కన్నేసింది. గురువారం ఇక్కడ మొదలైన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టాస్‌ నెగ్గిన త్రిపుర ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్‌ ప్రశాంత్‌ కుమార్‌ (120 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. శ్రీకర్‌ భరత్‌ (18) విఫలమవగా... కెప్టెన్‌ హనుమ విహారి (62 బ్యాటింగ్‌; 9 ఫోర్లు)తో కలిసి ప్రశాంత్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు.

వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. అర్ధసెంచరీ పూర్తయిన కాసేపటికి విహారి జట్టు స్కోరు 131 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తర్వాత ప్రశాంత్‌కు రికీ భుయ్‌ (49 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆటముగిసే సమయానికి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. త్రిపుర బౌలర్లలో మురాసింగ్, గురీందర్‌ సింగ్‌ చెరో వికెట్‌ తీశారు.

Advertisement
Advertisement