అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు | Sakshi
Sakshi News home page

అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు

Published Mon, Jun 1 2015 3:29 AM

Assam, Meghalaya in the South Asian Games

గువాహటి : దక్షిణాసియా క్రీడలను అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనే జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఈవెంట్ నవంబర్‌లో జరుగనుంది. ‘ గేమ్స్ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలని అస్సాం సీఎం కోరారు. మా తరఫు నుంచి ఈ రెండు రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఉంటుంది. భారత ఒలింపిక్ సంఘం అధికారులను ఢిల్లీకి పిలిచి ఆతిథ్యం, నిర్వహణ కమిటీల ఏర్పాటు గురించి చర్చించాల్సిందిగా క్రీడా శాఖ కార్యదర్శికి సూచించాను’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.

Advertisement
Advertisement